రంభ... ఈ పేరుని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయక్కర్లేదు. చిరంజీవి వెంకటేష్ రాజేంద్రప్రసాద్ వంటి బడా స్టార్ల సరసన నటించి అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా ఎదిగిన రంభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బావగారు బాగున్నారా సినిమా లోని సారీ సారీ అంటుందోయ్ కుమారి అనే పాటలో బాగా సెక్సీ గా కనిపించి ప్రేక్షకుల గుండెల్లో దడ పుట్టించింది. ఈ చిత్రంలోని అన్ని పాటలలో రంభ తన అందాలను బీభత్సంగా ఆరబోసింది. ఆర్ కే రోజా రాజేంద్రప్రసాద్ సరసన 1991లో ప్రేమ తపస్సు లో నటిస్తే... 1992లో రాజేంద్ర ప్రసాద్ సరసన రంభ ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో నటించింది. అయితే రాజేంద్ర ప్రసాద్ సరసన మొదటిసారిగా నటించిన వీళ్ళిద్దరూ పెద్ద అగ్రతారలు ఎదిగారు.

 


రంభ ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో నటించింది అని చెప్పుకోవచ్చు. తొలిముద్దు, బైరవ దీపం, ముద్దుల ప్రియుడు అల్లరి ప్రేమికుడు అల్లుడా మజాకా వంటి సినిమాలలో రంభ తన అందంతో పాటు నటన చాతుర్యాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించింది. 1995లో విడుదలైన మాయాబజార్ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. యమదొంగ చిత్రంలో కూడా ఆమె నాచోరే నాచోరే పాటలు శృంగారభరితమైన నాట్యం చేసి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. 

 


బొంబాయి ప్రియుడు లో జేడీ చక్రవర్తి సరసన రాగసుధ పాత్రలో నటించిన రంభ ఒక్కసారిగా తన క్రేజ్ పెంచేసుకుంది. ఈ చిత్రంలో చేతిలోన చెయ్యేసి చెప్పేయావా పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటలో రంభ తన అందం అభినయంతో ప్రేక్షకుల మనసులను పులకరింప చేసింది. అందుకేనేమో చాలామంది ఆమెను భూలోక రంభ అని పిలుస్తుంటారు. తెలుగు ప్రేక్షకులను ఎంతో ఎంటర్ టైన్ చేసిన ఆమె ప్రస్తుతం పెళ్లి చేసుకుని పిల్లలతో భర్త తో మంచి వైవాహిక బంధాన్ని కొనసాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: