పవన్ కళ్యాణ్ తన రాజకీయ పార్టీని బలోపేతం చేయడానికి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో సినిమారంగంలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన
పింక్ సినిమాకి రీమేక్ గా తెలుగులో రూపుదిద్దుకుంటున్న వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఒక స్టిల్ కూడా లీక్ అయ్యి పెద్ద దుమారమే రేపింది. ఆ లీకైన స్టిల్లు లో పవన్ కళ్యాణ్ లాయర్ వస్త్రాలు ధరించి కోర్టు మధ్యలో నిల్చున్నాడు. ఐతే ఈ లీక్ విషయంపై చిత్ర నిర్మాత దిల్ రాజు తీవ్రంగా మండిపడి పోలీసులను ఆశ్రయించి కేసు కూడా ఫైల్ చేసేందుకు సిద్ధపడినట్టు సమాచారం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంపై అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.


ఈ సినిమాలో మూడు కీలకమైన పాత్రలో నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి నటిస్తుండగా పవన్ కళ్యాణ్ ప్రధానమైన లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ కి జోడిగా ఒక హీరోయిన్ ని ఎంపిక చేసుకోవాల్సి ఉండగా దర్శక నిర్మాతలు శృతిహాసన్, జాన్వీ కపూర్, ఇలియానా వంటి స్టార్ హీరోయిన్లను సంప్రదించారు కానీ వారంతా నో చెప్పేసారు. దీంతో అనేక మంది హీరోయిన్లను సంప్రదించి చివరికి తమన్నాని అడిగారట. అలాగే ఎక్కువ రెమ్యునరేషన్ ని కూడా ఆఫర్ చేశారట.


ఎంతో పాపులారిటీ ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలంటే అదృష్టం ఉండాలి. అలాంటిది అతను సినిమాలో చేసినందుకుగాను ఎక్కువ రెమ్యూనరేషన్ కూడా వస్తే ఇక అంతకంటే అదృష్టమే లేదు. అందుకే మిల్కీ బ్యూటీ తమన్నా పవన్ సరసన నటించేందుకు వెంటనే ఓకే చెప్పేసిందని విశ్వసనీయ సినీ వర్గాల నుండి వార్తలు వెల్లువెత్తుతున్నాయి. చిత్రీకరణ ఇంకాస్త పూర్తయితే వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది కానీ కరోనా వైరస్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతుంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసుల సంఖ్య సినిమాలపై ఎంతో ప్రభావం చూపుతుండడంతో ఒకవైపు సినీ కార్మికులు మరొకవైపు సినీ అభిమానులు బాధను వ్యక్తం చేస్తున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: