ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హీరోయిన్ అనుష్క శర్మ జంటకు సోషల్ మీడియాలో తెగ క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే, ఎప్పుడు తమకు సంబంధించిన అప్డేట్ లను  సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తు ఉంటారు ఈ జంట, వీరికి అభిమానులు విరుష్క  అని ప్రేమతో ఒక నిక్ నేమ్  కూడా పెట్టుకున్నారు. అయితే విరాట్ కోహ్లీ తో తన ట్రిప్ గురించి తాజాగా అనుష్క శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఈ హాజరైన విరాట్ కోహ్లీ, సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ..తమ ట్రిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


 విరాట్ నేను పర్యటించిన ప్రతిసారి అది మా ట్రిప్ కాదు అని... కొన్ని సార్లు కలిసి భోజనం మాత్రమే చేసేవాళ్ళం అంటూ హీరోయిన్ అనుష్క శర్మ చెప్పుకొచ్చారు. నేను విరాట్  కలిసి పర్యటించాము  అంటే చూసేవాళ్ళందరూ మాకు సెలవు  అనుకుంటారు కానీ అదంతా నిజం కాదు.. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎప్పుడు ఎంతో బిజీగా ఉంటాడు... కొన్ని సార్లు ఎక్కడికైనా వెల్లాము  అంటే కేవలం కలిసి భోజనం చేయడం మాత్రమే జరుగుతుంది.



మా పెళ్లి జరిగిన తర్వాత మొదటి ఆరు నెలల్లో విరాట్  నేను కలిసి కేవలం 21 రోజులు మాత్రమే కలిసి ఉన్నాము  అంటూ చెప్పుకొచ్చింది అనుష్క శర్మ. కొన్ని కొన్ని సార్లు కేవలం కలిసి భోజనం చేయడానికి మాత్రమే విదేశాల్లో కలుసుకునేవాళ్ళం అని  తెలిపింది. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ నేను నా సతీమణి కలిసినప్పుడల్లా మా బంధం ఇప్పటిది కాదు ఎప్పటిదో అనిపిస్తూ ఉంటుంది. మా బంధం ఎప్పుడు ప్రేమతో నిండి ఉంటుంది... అందుకే ఇది కొన్ని రోజుల నుంచి కాదు యుగయుగాల నుంచి ఉన్నది అని అనిపిస్తూ ఉంటుంది అంటూ  విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు, ఇక వీరి జంట కు ఎంతో  మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: