యంగ్ హీరో నితిన్ వివాహం తన ప్రేయసి షాలినితో జరుగనుందని తెలిసిందే. గత ఎనిమిది ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు వీరి పెళ్ళికి ఇంట్లో వారు కూడా అగీకరించడంతో ఏప్రిల్ 16నే దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుందామనుకున్నాడు నితిన్ కానీ కరోనా  అతని ఆశలపై నీళ్లు చల్లింది దాంతో పెళ్ళి వాయిదాపడింది. ఇక ఇప్పట్లో కరోనా ఉద్ధృతి తగ్గేలా లేకపోవడంతో ఇక ఎక్కువ రోజులు వెయిట్ చేయకూడదని నితిన్ నిర్ణయించుకున్నాడు.
 
ఈనెల 26న పెళ్ళికి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది అయితే ఈపెళ్లి హైదరాబాద్ పరిసర ప్రాంతంలో వున్న ఫామ్ లో జరుగుతుందని వార్తలు వచ్చాయి  కానీ తాజాగా వేదిక మారిందని సమాచారం. ది గ్రేట్ ఫలక్ నుమా ప్యాలెస్ లో నితిన్-షాలిని వివాహం జరుగనుందట. ఈ పెళ్ళికి జనసేన అధినేత  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. 
 
ఇక నితిన్ ప్రస్తుతం రెండు చిత్రాలలో నటిస్తున్నాడు అందులో తొలిప్రేమ ఫేమ్ వెంకీ డైరెక్షన్ లో తెరక్కుతున్న రంగ్ దే ఒకటి. సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈచిత్రం మేలోనే విడుదలకావాల్సి వుంది కానీ కరోనా వల్ల వాయిదాపడింది. ఆగస్టు నుండి మిగిలిన షూటింగ్ ప్రారంభం కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈచిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
 
ఈ సినిమాతోపాటు నితిన్,సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: