కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ మహమ్మారికి మందు లేకపోవటంతో ప్రజలంతా ఆరోగ్యమీద శ్రద్ధ పెడుతున్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇమ్యూనిటీ పెరిగితే కరోనా ఎదుర్కొన వచ్చిన వైద్య వర్గాలు చెపుతుండటంతో ఆ దిశ కసరత్తులు చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఇదే పనిలో ఉన్నారు. కేవలం వారు చేయటమే కాదు ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

 

బాలీవుడ్‌ హాట్ బ్యూటీ నర్గీస్‌ ఫక్రీ తన సోషల్ మీడియా పేజ్‌లో ఫోటోలను పోస్ట్‌ చేసింది. కాలిఫోర్నియాలో డిటాక్సింగ్‌ కోసం మడ్‌ బాత్‌ చేయించుకున్న ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేసింది ఈ బ్యూటీ. పర్పుల్‌ టూ పీస్‌ బికినీలో ఎర్ర మట్టిని ఒళ్లంత రాసుకున్న నర్గీస్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

ఈ ఫోటోలతో పాటు `క్రమం తప్పకుండా మీ జీవితాలను డిటాక్స్  చేసుకోండి. పాతను బయటకు పంపి, కొత్తకు స్వాగతం పలకండి అంటూ పోస్ట్ చేసింది నర్గీస్‌ ఫక్రీ. కాలిఫోర్నియా స్పాలో మడ్‌ బాత్‌ చేయించుకున్న నర్గీస్‌ తన అనుభావాలను షేర్‌ చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: