రాశీకన్నా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 2013లో విడుదలైన హిందీ చిత్రం `మద్రాస్ కెఫె`లో భారత ఇంటలిజెంస్ అధికారి విక్రం సింగ్ భార్య రూబి సింగ్ పాత్ర ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది ఈ బ్యూటి. ఆ తర్వాత మనం చిత్రంతో తెలుగులో అడుగుపెట్టి.. ఊహలు గుసగుసలాడే సినిమాలో నటించింది. ఆ సినిమాలో నాగశౌర్య సరసన మెరిసి తెలుగువారి హృదయాలను దోచుకుంది.
ఆ సినిమా తరువాత ఈ భామకి తెలుగు లో వరుస అవకాశాలు వచ్చాయి. ఇక తెలుగు తో పాటు తమిళ్ లో కూడా అడపా దడపా సినిమాలు చేస్తూ.. మంచి క్రేజ్ తెచ్చుకుంది. సినిమా ప్రారంభంలో లావుగా కనిపించిన రాశీ ఖన్నా ఆ తరువాత అవకాశాల కోసం జీరో సైజ్ లోకి మారి.. మరింతగా ఆకర్షించింది. ఇక ఈ బ్యూటి అందంతోనే కాదు.. నటనతో కూడా ప్రేక్షకులను మైమరిపించిందని చెప్పాలి. ఎందుకంటే.. తాను ఎంచుకున్న ప్రతి సినిమాలోనూ పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించి.. మంచి నటిగా పేరు తెచ్చుకుంది.
అలాగే రాశీకన్నా మొదట స్కిన్ షోకు దూరంగా ఉన్నా.. ఆ తర్వాత అందులోనూ వెనుకడుగు వేయలేదు. ఇక ఇటీవల ఈ అమ్మడు నటించిన వెంకీమామ, ప్రతిరోజూ పండగే సినిమాలతో రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇక వరుసగా మరో హిట్ దక్కుతుందని ఆశ పడితే అది రివర్స్ అయింది. విజయ్ దేవరకొండతో నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ ఫలితంతో ఓ భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది రాశీ. ప్రస్తుతం రాశీకి తెలుగులో ఆఫర్లు లేకపోయినా.. తమిళంలోనే మాత్రం రెండు, మూడు సినిమాలు చేస్తోంది.