మన తెలుగు లో కథలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఒక సినిమా కథ విషయంలో గతంలో ఒకటికి పది సార్లు ఆలోచన అనేది లేకుండా హీరోలు ఓకే చేసారు. ఇప్పుడు కథల విషయంలో మాత్ర౦ చాలా బాగా దర్శక నిర్మాతలను స్టార్ హీరోలు ఇబ్బంది పెడుతున్నారు అనే వార్తలు టాలీవుడ్ లో వినపడుతున్నాయి. దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని కథల విషయంలో గతంలో పెద్దగా ఆలోచన చేయని హీరోలు ఇప్పుడు కథల విషయంలో మాత్రం చాలా వరకు జాగ్రత్తలు పడుతూ సినిమాలు చేస్తున్నారు అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో బాగానే జరుగుతుంది.  

 

దానికి కరణం ఏంటీ అంటే లాక్ డౌన్ కారణంగా సినిమాలు చాలా వరకు నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కథల విషయంలో దూకుడుగా వెళ్లి సినిమాలను ఓకే చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని అందుకే స్టార్ హీరోలు ఇప్పుడు కథల విషయంలో అంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. టాలీవుడ్ లో జనాలు కూడా ఇప్పుడు కథ బాగుంది అనుకుంటే ఒకటికి రెండు సార్లు చూస్తున్నారు గాని కథలో పట్టు లేదు అనుకుంటే మాత్రం సినిమాను చూడటానికి అంతగా ఆసక్తి అనేది చూపించే పరిస్థితి అయితే లేదు అనే చెప్పాలి. 

 

ఇప్పుడు రెండేళ్ళ పాటు దర్శక నిర్మాతలు కూడా కథల విషయంలో ఆలోచనలో పడే అవకాశం ఉంది. రాబోయే రెండేళ్ళు కూడా కాస్త కష్టంగా ఉండే అవకాశాలు ఉన్న నేపధ్యంలో కాస్త జాగ్రత్త పడుతున్నారు అని తెలుస్తుంది ఇక ఇప్పుడు  మహేష్  బాబు రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి హీరోలు ప్రభాస్ లాంటి పూర్తిగా కమర్షియల్ ఇమేజ్ ఉన్న హీరో కథల విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని సినిమాలు చేస్తున్నారు అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: