మన తెలుగు లో ఇప్పుడు ఉన్న  పరిస్తితితుల ఆధారంగా చూస్తే సినిమాలు చేయడం అనేది దాదాపుగా సాహసం అనే చెప్పాలి. స్టార్ హీరోల తో సినిమాలు చెయ్యాలి  ఆనే ఆలోచన కూడా నిర్మాతలను దర్శకులను కాస్త బాగానే కంగారు పెడుతుంది అనే చెప్పాలి మరి. అగ్ర హీరోల సినిమాల విషయంలో గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు ఏ మాత్రం కూడా లేదు అనేది వాస్తవం. సినిమాలో పెట్టుబడి పెట్టడం అనేది అంత ఈజీ అయితే కాదు అనే సంగతి అందరికి ఒక క్లారితి అయితే వచ్చింది. ఇక ఇప్పుడు చిరంజీవి ఒక నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. 

 

సీనియర్ హీరోలతో పెట్టుబడులు పెట్టడం అనేద నిర్మాతలకు కాస్త కష్టంగా ఉంది కాబట్టి ఆయన కూడా ఎప్పుడు రామ్ చరణ్ తో మాత్రమే సినిమాలు చేయలేరు కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు అని టాక్. ఇక నుంచి పారితోషికం విష్యం లో ఏ మాత్రం  ఏ మాత్రం కూడా డిమాండ్ చేయవద్దు అని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. సినిమా వసూళ్ళ ఆధారంగా మాత్రమే తాను షేర్ తీసుకోవాలి గాని పారితోషికం మాత్రం వద్దు అని ఆయన భావిస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై స్పష్టత లేదు గాని నిజమే అని అంటున్నారు. 

 

ఆయన వచ్చే ఏడాది ఒక మూడు సినిమాలను లైన్ లో పెట్టారు. ఈ మూడు సినిమాలు కూడా ఆయన  భారీ బడ్జెట్ తో చేస్తున్న సినిమాలే కావడం గమనార్హం. అందుకే ఆయన కాస్త వెనక్కు తగ్గి సినిమా వసూళ్ళ ఆధారంగా మాత్రం తీసుకునే ఆలోచనలో ఉన్నారు అని టాలీవుడ్ లో  టాక్ మరి. ఇప్పుడు ఆయన ఆచార్య అనే సినిమాలో కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: