సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ లేకపోయినా పర్వాలేదు. గ్లామర్ ఉంటే చాలంటారు. కానీ వితౌట్ గ్లామర్ తో.. కేవలం పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది నివేద థామస్. ఆ టాలెంటే ఆమెకు శ్రీరామరక్ష. ఇద్దరు సూపర్ స్టార్స్ తో నటించే అవకాశం దక్కించుకుంది నివేద. 

 

జెంటిల్ మేన్ తో తెలుగులో అడుగుపెట్టిన నివేద థామస్ వరుస సక్సెస్ లతో పాటు.. నటిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. దర్బార్ లో రజినీకాంత్ కూతురుగా నటించి మరోసారి ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో వి సినిమాతో పాటు.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో నటిస్తోంది నివేద. 

 

నివేద థామస్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. మహేశ్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సర్కార్ వారి పాట సెకండ్ హీరోయిన్ గా ఎంపికయిందట. ఇలా సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురుగా నటించిన నివేద మరో సూపర్ స్టార్ మహేశ్ తో జతకడుతోంది. జై లవకుశ తర్వాత స్టార్ హీరో పక్కన నటించడం ఇది రెండో సారి. 

 

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన 24ఏళ్ల నివేద గ్లామర్ కు దూరంగా ఉంటూ.. టాలెంట్ ను మాత్రమే నమ్ముకుంది. ఈ దారిలో వెళుతూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న అతికొద్ది మందిలో నివేద ఒక్కటి. యాక్టింగ్ పరంగా సూపర్ స్టార్.. నివేద నుంచి గట్టిపోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.  

 

సర్కార్ వారి పాట హీరోయిన్స్ విషయంలో మహేశ్ చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కీర్తి సురేష్, నివేద థామస్ ఇద్దరూ ఇద్దరే. మహానటితో జాతీయ ఉత్తమనటి అనిపించుకున్న కీర్తి సురేష్ టాలెంట్ ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఇక నివేద థామస్ గురించి చెప్పనక్కరలేదు. మరి మహేశ్ ఈ ఇద్దరి మధ్యలో పడి తేలిపోతాడో.. లేదంటే యాక్టింగ్ తో ధీటుగా సమాధానం చెబుతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: