జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా రాబోతోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్ డైరెక్టర్ తో తారక్ ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తాడనే మాటలు వినిపించాయి. కానీ ఇప్పుడు సడన్ గా ట్విస్ట్ ఇస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తారక్ తనకోసం కాకుండా మరో హీరో కోసం ప్రశాంత్ ని కాంటాక్ట్ చేశాడనే గాసిప్స్ గుప్పుమంటున్నాయి. మరి జూనియర్ ఎన్టీఆర్ ఎవరి కోసం ప్రశాంత్ ని కలిశాడు. 

 

కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ లోనూ ఫుల్ ఫేమస్ అయ్యాడు ప్రశాంత్ నీల్. ఈ డైెరెక్టర్ తో సినిమా చేసేందుకు మహేశ్ బాబు లాంటి స్టార్స్ కూడా ట్రై చేశారనే మాటలు వినిపించాయి. అయితే తారక్ బర్త్ డేకి ప్రశాంత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తో వీళ్లిద్దరి కాంబోలో సినిమా రాబోతుందనే ప్రచారం ప్రచారం మొదలైంది. 

 

మైత్రీ మూవీ మేకర్స్ తో జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందనే టాక్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు తారక్ నిర్మాణంలో ప్రశాంత్ మరో హీరోతో సినిమా చేస్తాడనే ప్రచారం మొదలైంది. నానీతో ప్రశాంత్ సినిమా తీస్తాడని.. ఈ మూవీని తారక్, నాని సంయుక్తంగా నిర్మిస్తారని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.

 

జూనియర్ ఎన్టీఆర్ నిర్మాతగా మారుతున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. భార్గవ్ హరి పేరుతో బ్యానర్ స్టార్ట్ చేస్తున్నాడనే మాటలు వినిపించాయి. సో తారక్ సొంత బ్యానర్ లో ఫస్ట్ మూవీగా బయటి హీరోతో సినిమా చేయబోతున్నాడని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుంది అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కలిసింది తనకోసం కాదనీ.. మరొకరి కోసమంటూ గాసిప్స్ గుప్పుమంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: