నైజాం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనివాస్ ఏకంగా  నాలుగు సినిమాల నైజాం హక్కులను కొనేశాడట  అందులో అన్ని మంచి హైప్ వున్న చిత్రాలే కావడం విశేషం. ఇంతకీ ఆ సినిమాలేంటంటే.. మాస్ మాహారాజ రవితేజ నటిస్తున్న క్రాక్ , రానా -సాయి పల్లవిల విరాటపర్వం ,శర్వానంద్ శ్రీకారం అలాగే గోపిచంద్  సీటిమార్.. 
 
వీటిలో మొదటగా క్రాక్ విడుదలకానుంది. ఇప్పటికే  80శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈచిత్రం ఈనెలలో మిగితా షూటింగ్ ను కంప్లీట్ చేసుకోనుంది. థియేటర్లు తెరుచుకోగానే క్రాక్ ను విడుదలచేయనున్నారు. గోపిచంద్ మలినేని  డైరెక్ట్ చేస్తున్న ఈచిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు.
 
ఇక విరాటపర్వం కూడా దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుటుంది. దసరాకు ఈ చిత్రాన్ని విడుదలచేసే ఆలోచన లో వున్నారు నిర్మాతలు. వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని సురేష్ బాబు ,చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.   
 
శ్రీకారం విషయానికి వస్తే ఈసినిమా కూడా అక్టోబర్ లో విడుదలకానుంది దాదాపు షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కిషోర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా 14రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది. నాని గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఇక సీటీమార్ 50శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా ఆగస్టు నుండి మిగితా షూటింగ్ ప్రారంభం కానుంది. సింగిల్ షెడ్యూల్ లో మిగితా భాగం షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈఏడాది చివర్లో ఈ సినిమా విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: