గత రెండేళ్లుగా సరైన సక్సెస్ కోసం పరితపించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన అలవైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. ఇకపోతే ఈ సినిమా తరువాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎంతో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవల లాక్ డౌన్ కు ముందు రెండు షెడ్యూల్స్ శేషాచలం అడవుల్లో జరిగాయి. 

IHG

అయితే ఆ తరువాత కరోనా ఎఫెక్ట్ తో దేశంలో లాక్ డౌన్ విధించడంతో ఈ సినిమా షూట్ కూడా ఆగిపోయింది. ఇక కొద్దిరోజుల క్రితం సినిమా షూటింగ్స్ కు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడంతో, తమ సినిమా తదుపరి షెడ్యూల్స్ కోసం ఇప్పటికే పుష్ప యూనిట్ కసరత్తులు మొదలెట్టిందట. నిజానికి సినిమాలోని కీలక సన్నివేశాలు పలు అడవి ప్రాంతాల్లో తీయవలసి ఉందని, అయితే మునుపటి పరిస్థితులు లేకపోవడంతో వేరే రాష్ట్రంలో తీయవలసిన సీన్స్ ని నల్గొండ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తీసేలా ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు ఈ కరోనా మహమ్మారి దెబ్బకు సినిమా బడ్జెట్ విషయమై కొంతవరకు కోత విధించినట్లు సమాచారం. సినిమా కోసం అంతకముందు ఒక భారీ సెట్ వేయదలిచారని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దానిని విరమించి, దాని స్థానే వేరే ప్రాంతంలో షూటింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తున్నారు. 

 

అలానే ఇటువంటి పరిస్థితుల్లో హీరో అల్లు అర్జున్ కూడా ఈ సినిమాకు తన రెమ్యునరేషన్ కొంత మేర తగ్గించుకుంటున్నట్లు ఇప్పటికే వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. మొత్తంగా చూస్తే ఈ మాయదారి కరోనా దెబ్బ మిగతా ఇండస్ట్రీ లతో పాటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పై కూడా బాగానే పడ్డట్లు స్పష్టం అవుతోంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ పుష్ప కు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: