మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ మరోసారి నటన కి ఆస్కారం ఉన్న పాత్రలో నటించింది. ఆ సినిమానే పెంగ్విన్. గత కొన్నాళ్ళుగా ఈ సినిమా గురించి అటు తమిళంలో ఇటు తెలుగులో ఆసక్తి కరమైన చర్చలు జరిగాయి.లాక్ డౌన్ కారణంగా ఎట్టకేలకు ఈ సినిమాని ఓటీటీ ప్లాట్ ఫాం లో రిలీజ్ చేశారు మేకర్స్. సినిమా కి ఎలాంటి రివ్యూలు, రేటింగులు వచ్చిన కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ కి మాత్రం ప్రేక్షకులు పొగడ్తలు ప్రశంసలతో ముంచెత్తారు. ప్రగ్నెంట్ స్త్రీ పాత్రలో కీర్తి నటన అద్భుతం అంటూ కీర్తించారు.

 

తమిళ దర్శక నిర్మాత కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాని నిర్మించాడు. ఈశ్వర్ కార్తీక్ ఈ సినిమాని తెరకెక్కించాడు. వాస్తవంగా రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు తెలుగు తమిళం తో సహా మిగతా భాషల్లో చాలానే ఉన్నాయి. అవన్ని ల్యాబ్ లోనే ఉండిపోయాయి. కాని హీరోయిన్ ఓరియెంటెడ్ గా రూపొందిన ఈ సినిమాని మాత్రం మేకర్స్ ధైర్యం చేసి రిలీజ్ చేశారు. చెప్పాలంటే కీర్తి సురేష్ ఈ సినిమాకోసం చాలా రిస్క్ చేసింది. కేవలం 35 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పట్లో పెద్ద ప్రయోగమనే చెప్పాలి. ఆ ప్రయోగం విజయవంతం అయింది. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు మహానటి కీర్తి సురేష్ కి మరో అవార్డ్ రావడం పక్కా అని అంటున్నారు.

 

ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ నటించిన మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా మిస్ ఇండియా కూడా రిలీజ్ కి సిద్దంగా ఉంది. అలాగే మరో హీరోయిన్ ఓరియెంటెడ్ గుడ్ లక్ సఖీ కూడా సగానికి పైగా షూటింగ్ జరుపుకొని ఉంది. ఇవి రెండు సినిమాలు తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ కానున్నాయి. ఇక యంగ్ హీరో నితిన్ సరసన రంగ్ దే అన్న సినిమాలో నటించింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా లాక్ డౌన్ పరిస్థితులు చక్కబడిన తర్వాత రిలీజ్ కానుంది.

 

అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది కీర్తి సురేష్. ఈ సినిమా తెలుగులో అన్నయ్య పేరుతో రిలీజ్ కానుంది. ఇవి కాకుండా సర్కారు వారి పాటలోను సూపర్ స్టార్ మహేష్ బాబు కి జంటగా నటించబోతుందన్న వార్తలు వస్తున్నాయి. కాని ఇంకా ఈ విషయంలో చిత్ర యూనిట్ నుండి అధికారకమైన ప్రకటన వెలువడలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: