'మహానటి' సినిమా తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కీర్తి సురేష్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ హీరోల పక్కన నటిస్తూ అవకాశాలు అందుకుంటూ తన మార్కెట్ ఎక్కడ తగ్గకుండా మెయింటెన్ చేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ తో 'అజ్ఞాతవాసి' సినిమా చేసిన కీర్తి సురేష్ త్వరలో పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మూవీ 'సర్కారీ వారి పాట' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఒక్క సినిమా కాకుండా తెలుగులో నాగచైతన్యతో విక్రమ్ కుమార్ డైరెక్టర్ గా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వస్తున్న సినిమాల్లో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్లు వార్తలు రావడం జరిగాయి.

 

ఇదిలా ఉండగా ఇటీవల కీర్తి ఫోటోలు చూసిన నాగచైతన్య మరియు సినిమా యూనిట్… కీర్తి తన ఫేస్  వేల్యూ పోగొట్టుకుంది అని, ఇదివరకు మాదిరిగా కీర్తి సురేష్ అభినయం లేదని అభిప్రాయపడుతున్నారు అట. ముఖ్యంగా పెంగ్విన్ సినిమాకు కీర్తి చాలా వరకు తన ముఖంలో అందాన్ని పోగొట్టుకునే విధంగా తనని తాను ఆవిష్కరించుకుంటూ ఉండటంతో ప్రజెంట్ అదే లుక్ లో ఉండటంతో…నాగచైతన్య సినిమాలో కీర్తి సురేష్ కి  బదులు రష్మిక మందన ని తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇద్దరి మధ్య కీర్తి సురేష్ అండ్ రష్మిక మందన్న ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

సినిమా షూటింగ్ మొదలవటానికి టైం పట్టే పరిస్థితి ఉండటంతో ఆ లోపు కీర్తి సురేష్ తిరిగి ఫామ్ లోకి వస్తే ఆమెనే తీసుకోవాలని సినిమా యూనిట్ డిసైడ్ అయినట్లు సమాచారం. మరి నాగచైతన్య పక్కన ఎవరు నటిస్తారో  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: