నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. మిడ్ రేంజ్ హీరోల్లో టాప్ లో ఉన్న నాని మంచి సక్సెస్ రేటుతో కెరీర్ ని చక్కగా నిర్మించుకుంటున్నాడు. గ్యాంగ్ లీడర్ తర్వాత  నాని నటించిన వి సినిమా కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇంద్రగటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో విడుదల అవుతుందంటూ వార్తలు వచ్చాయి.

 

 

అయితే చిత్రబృందం ఈ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. థియేటర్లు మరో రెండు మూడు నెలల వరకి తెరుచుకునే పరిస్థితి కనిపించకపోవడంతో నిర్మాత దిల్ రాజు వి సినిమాని ఓటీటీలో విడుదల చేయడానికే భావిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి స్ట్రీమింగ్ సైట్స్ నుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయట. ఎవరో ఎందుకు అల్లు అరవింద్ 30కోట్లు ఆఫర్ చేసాడని టాక్ వినబడుతుంది.

 

 

ఇంకా ఇతర సైట్ల నుండి కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయట. కానీ దిల్ రాజు ఆహాకే మొగ్గుచూపుతున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు అల్లు అరవింద్ కూడా దిల్ రాజుపై ఒత్తిడి చేస్తున్నాడట. కానీ దిల్ రాజు నుండి ఎలాంటి సమాధానం రావడం లేదట. వి సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయడం నానికి ఇష్టం లేనందువల్లే దిల్ రాజు ఒప్పుకోవడం లేదని అంటున్నారు. అయితే పరిస్థితుల వల్ల నానిని ఒప్పించేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడట.

 

 

నాని మొదటి సారిగా నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు మరో హీరోగా ఉన్నాడు. నివేథా థామస్, అదితీ రావ్ హైదరీ హీరోయిన్లుగా చేస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించాడు. ఇంద్రగంటి మోహనక్రిష్ణ తన పంథా మార్చుకున్ని తెరకెక్కించిన ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో ఓటీటీలో సందడి చేసేలా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: