మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తర్వాతి చిత్రం ఎవరితో ఉంటుందనేది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో హీరోగా చేస్తున్న రామ్ చరణ్, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయమై ఇంకా నోరు విప్పలేదు. ఆర్.ఆర్.ఆర్ ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో పరిచయం అవుతుండగా, ఆ తర్వాతి చిత్రం ఎవరి దర్శకత్వంలో ఉండనుందనేది సస్పెన్స్ గా మారింది.

 

మెగాస్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కీలకమైన పాత్ర చేస్తున్న రామ్ చరణ్, ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని అన్నారు. కానీ ఈ విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ తన తర్వాతి చిత్రాన్ని కొత్త దర్శకుడితో చేయాలని అనుకుంటున్నాడట. సతీష్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకి ఇంప్రెస్ అయిన రామ్ చరణ్ సినిమా చేద్దామని అనుకుంటున్నాడట.

 

ఈ చిత్రానికి సభకు నమస్కారం అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ అయిందని సమాచారం. నూతన దర్శకుడు సతీష్ మొదటగా ఈ కథని అల్లు అర్జున్ కి వినిపించాడట. కానీ ఏవేవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే రామ్ చరణ్ ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళనున్నాడని వినిపిస్తుంది. మరి ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా అంటే ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి.

 

అదీగాక పాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్న తర్వాత కొత్త దర్శకుడితో సినిమా చేయడం అంటే రిస్కే. మరి రామ్ చరణ్ ఆ రిస్కు తీసుకుని కొత్త దర్శకుడితో సినిమా చేస్తాడా లేదా పేరున్న మరో దర్శకుడితో చేస్తాడా అన్నది చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: