సూప‌ర్‌ స్టార్ మహేష్ లాక్ డౌన్ సమయంలో తన పిల్లలు గౌతమ్ సితార లతో కలిసి చిన్నపిల్లవాడిలా చేసిన అల్లరి పనులకు సంబంధించి నమ్రత ఎప్పటికప్పుడు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ కావడంతో మహేష్ కు ఒక అరుదైన రికార్డు వచ్చేలా చేసి మహేష్ ను దక్షణాది సినిమారంగ హీరోలలో అగ్రస్థానంలో నిలిచేలా చేసింది.  


టాలీవుడ్ ప్రిన్స్ గా లక్షలాది అభిమానులు కలిగిన మహేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడ టాప్ హీరో కావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ట్విట‌ర్‌లో అత్య‌ధికంగా కోటి మంది ఫాలోయర్స్ సంపాదించుకున్న ఏకైక దక్షిణాది హీరోగా మహేష్ ఇప్పుడు మరొక ఎత్తుకు ఎదిగాడు. 


ఇలా మహేష్ ఈ స్థానాన్ని అందుకోవడానికి గల ప్రధాన కారణం ఈ లాక్ డౌన్ సమయంలో మహేష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు ఎక్కువగా షేర్ కావడం. ముఖ్యంగా మహేష్ తన పిల్లలతో ఈ లాక్ డౌన్ పిరియడ్ లో ఎంజాయ్ చేసిన ఫోటోలను ఎక్కువగా షేర్ చేయడంతో ఆ ఫోటోలు కేవలం మన తెలుగువారు మాత్రమే కాకుండా మన పొరుగు రాష్ట్రాలలో ఉన్న తమిళనాడు కర్ణాటక ప్రాంతంలోని సినిమా అభిమానులు విపరీతంగా చూడటం లైక్ లు కొట్టడంతో మహేష్ కు ఏకంగా కోటిమంది అభిమానులు ఏర్పడారు. 


త‌మిళ హీరో ధ‌నుష్ కు 91 ల‌క్ష‌ల మందితో ట్విటర్ లో ఫాలోయర్స్ ఉంటే ఆ ఫిగర్ ను బ్రేక్ చేసి మహేష్ కోటిమంది అభిమానులను దక్షిణాది రాష్ట్రాలలో ఏర్పరుచుకోవడంతో మహేష్ మ్యానియా పొరుగు రాష్ట్రాలకు కూడ వ్యాపించింది. వాస్తవానికి మహేష్ తన మార్కెట్ ను తమిళనాడులో పెంచుకోవాలని ‘స్పైడర్’ మూవీ ద్వారా ప్రయత్నాలు చేసాడు. అయితే ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి కాని మహేష్ కలలు కన్న దక్షిణాది సూపర్ స్టార్ ఇమేజ్ ఇప్పుడు అతడి పిల్లలు గౌతమ్ సితారులు వల్ల సఫలం కావడం యాధృశ్చికం అనుకోవాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: