టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న ఇద్దరు హీరోయిన్స్ హవా ఓ రేంజ్ లో నడుస్తుంది. వాళ్లిద్దరు కాదన్న తర్వాతే వేరే వాళ్లకు ఆఫర్ ఇస్తున్నారట. తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ఆ ఇద్దరు స్టార్స్ ఎవరు అంటే ఒకరు కన్నడ భామ రష్మిక మందన్న కాగా మరొకరు పూజా హెగ్దె అని తెలుస్తుంది. ఒక లైలా కోసం, ముకుంద సినిమాలతో ఎంట్రీ ఇచ్చి దువ్వాడ జగన్నాథం సినిమతో హిట్టు కొట్టిన పూజా హెగ్దె ఆ సినిమా నుండి వరుస స్టార్ సినిమాలు చేస్తూ కెరియర్ ఫుల్ జోష్ లో ఉంది.

 

ఇక మరోపక్క ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి గీతా గోవిందంతో సెన్సేషనల్ హిట్టు కొట్టిన రష్మిక మందన్న ఆ తర్వాత స్టార్స్ తో జోడీ కడుతుంది. ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రష్మిక, అల వైకుంఠపురములో సినిమాతో పూజా హెగ్దె ఇద్దరు మరో హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అందుకే స్టార్ సినిమా అంటే అయితే పూజా హెగ్దే లేదా రష్మిక మందన తప్ప మిగతా హీరోయిన్స్ వద్దే వద్దని అంటున్నారట. ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న ఈ ఇద్దరు హీరోయిన్స్ ఎంత అడిగితే అంత ఇచ్చి మరి తమ సినిమాకు ఓకే చేసుకుంటున్నారు.

 

పూజా హెగ్దె ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తుంది. మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇక రష్మిక కూడా అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ త్రివిక్రం సినిమాలో కూడా నటిస్తుందని తెలుస్తుంది. మొత్తానికి ఈ ఇద్దరు హీరోయిన్స్ ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలేస్తున్నారు. వీళ్లకు డేట్స్ అడ్జెస్ట్ కాక చేయలేమని చెప్పిన తర్వాతే వేరే హీరోయిన్స్ దగ్గరకు స్టార్ సినిమాలు వెళ్తున్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: