నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రంగ్ దే. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మేలోనే విడుదలకావల్సింది కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పటివరకు70 శాతం షూటింగ్ పూర్తి కాగా మిగితా షూటింగ్ ఆగస్టు నుండి ప్రారంభం కానుంది.
ఇక ఈషెడ్యూల్ న్యూజిలాండ్లో జరుగనుందని సమాచారం. అందుకోసం అక్కడి ప్రభుత్వాన్ని పర్మిషన్ కూడా అడిగారట నిర్మాతలు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గింది దాంతో లాక్ డౌన్ పూర్తి సడలించారు. ఇటీవల న్యూజిలాండ్ లో జేమ్స్ కామెరూన్, అవతార్ సీక్వెల్ షూటింగ్ కూడా మొదలు పెట్టాడు దాంతో రంగ్ దే టీం కూడా అక్కడే చివరి షెడ్యూల్ పూర్తి చేయాలనుకుంటున్నారు. ఒకవేళ షూటింగ్ కు ఓకే చెప్తే రంగ్ దే టీం న్యూజిలాండ్ వెళ్ళాక 14రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈఏడాది చివర్లో రంగ్ దే విడుదలకానుంది.