దృశ్యం సినిమా.. ఈ సినిమా ఎప్పుడు టీవీ లో వచ్చినా సరే జనాలు మిస్ అవకుండా చూస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు కూతురుని కుటుంబాన్ని కాపాడుకోవడానికి గానూ ఒక తండ్రి ఒక భర్త ఒక ఇంటి పెద్ద పడే తపన ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమా చివరి వరకు కూడా ఒక రేంజ్ లో ఆసక్తి రేపుతుంది. ఇక దేశంలోనే ఒక మంచి థ్రిల్లర్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచింది అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత... అలాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటూ చాలా మంది ఎదురు చూసారు.

 

ఇక ఈ సినిమాలో ప్రతీ ఒక్కరి నటన కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. అసలు సినిమా కథ ఒక రేంజ్ లో ఉంటుంది అని చాలా మంది బాలీవుడ్ లో కూడా అన్నారు. ఈ సినిమాను మూడు నాలుగు భాషల్లో రీమేక్ చేసినా డబ్బింగ్ చేసినా సరే ఈ సినిమాను చాలా మంది ఆదరించారు అనేది వాస్తవం. దానికి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ షూటింగ్‌ వచ్చే నెల 17న ప్రారంభం కావచ్చని అంటున్నారు. రూ.50 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి మలయాళ సినిమా ఇదే అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. 

 

తన 60వ పుట్టిన రోజు (మే 21) సందర్భంగా ‘దృశ్యం 2’ చిత్రంలో నటిస్తున్నాననీ, జీతూ జోసఫ్‌ దర్శకత్వం వహిస్తారనీ మోహన్‌లాల్‌ ఒక ప్రకటన కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆయన నటించడానికి షూటింగ్ కి రావడానికి ఓకే చెప్పారు అని అంటారు. గత నెల్లోనే షూటింగ్స్‌ జరుపుకోవడానికి కేరళ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొందరు తెలుగు వాళ్ళు కూడా నటించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: