టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ దంపతులు నాగ చైతన్య సమంత. వీరి కాంబినేషన్ లో సినిమా అనగానే జనాలకు ఒక క్రేజ్ అనేది ఉంటుంది. సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ వీళ్ళ కాంబినేషన్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇక వీళ్ళు కూడా ఫాన్స్ కి ఒక రేంజ్ లో తమ కాంబినేషన్ తో ఫుల్ జోష్ ఇస్తూ ఉంటారు. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా అదే పరిస్థితి ఉంది అని చెప్పాలి. ఇప్పుడు టాలీవుడ్ లో వీరు ఇద్దరూ కలిసి దాదాపుగా మూడు సినిమాల్లో చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. 

 

వీళ్లిద్దరు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనం’ సినిమలో నటించగా ఇప్పుడు ఆయన కాంబినేషన్ లోనే మరో సినిమాలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో పాటు వీళ్లిద్దరు కలిసి నందిని రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. అదే విధంగా నాగచైతన్య పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని టాక్. ఆ సినిమాలో కూడా ఆమె నటిస్తుంది అని తెలుస్తుంది. ఇలా దాదాపు మూడు నాలుగు సినిమాల్లో ఆమె నటించే అవకాశం ఉంది చైతు తో కలిసి. 

 

మరో హీరో తో ఆమె సినిమాలను ఒప్పుకోవడం లేదు అనే టాక్ కూడా టాలీవుడ్ వర్గాల్లో వినపడుతుంది. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని సినిమాలు వద్దు అని మావగారు నాగార్జున చెప్పారు అని అందుకే ఆమె చేయడం లేదు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలు అన్నీ కూడా లో బడ్జెట్ సినిమాలే అనే సంగతి తెలిసిందే. రాబోయే రెండేళ్ళ పాటు ఇద్దరూ కలిసే సినిమాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: