తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.  కామంతో రెచ్చిపోయిన ఓ యువకుడు ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. తన గుట్టు ఎక్కడ బయట పడుతుందో అన్నభయంతో ఆ చిన్నారిపై దాడి చేసి చంపేసి చెరువు వద్ద పడవేశాడు. బాలిక తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఫై విచారణ చేపట్టిన అరంతాంగి పోలీసులు గ్రామంలోని చెరువు దగ్గర తీవ్ర గాయాలతో బాలిక మృతదేహం కనుగొన్నారు. 7 సంవత్సరాల బాలికను అతి కిరాతకం గా అత్యాచారం చేసి హత్య చేసిన రాజా అనే యువకుడిని ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ విషయంపై డీఎంకే నేత ఎంపీ కనిమొళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణానికి పాల్పపడ్డ ఆ నీచుడిపై  నేషనల్ చైల్డ్  ప్రొటెక్షన్  కమిషన్ సుమోటో గా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

 

అంతే కాదు త‌మిళ ప్ర‌జ‌ల ఆగ్ర‌హ‌జ్వాల‌లు మొద‌ల‌య్యాయి.  తాజాగా నటి సాయి పల్లవి రోజులు గ‌డిచేకొద్ది ప్ర‌కృతి మ‌న‌కి సందేశాన్ని ఇస్తున్న‌ట్టు క‌నిపిస్తుంది. మాన‌వ‌జాతిని పూర్తిగా తుడిచిపెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్న‌ట్టు క‌నిపిస్తుంది. అలాంటి దారుణ ఘటనలు చూడానికి ఇలాంటి దారుణమైన జీవితాన్ని గడుపుతున్నాము.. ఈ అమానవీయ ప్రపంచానికి మరొక బిడ్డకు జన్మనివ్వడానికి అర్హత లేదు. మనలోని క్రూరత్వాన్ని సంతృప్తి పరచడానికి పిల్లలను చంపుతున్నారు అని సాయి ప‌ల్ల‌వి ఆవేద‌న వ్యక్తం చేసింది.

 

ఇక ఇలాంటి రోజు రాకూడదు.. నేరం వెలుగులోకి వచ్చినప్పుడు లేదా సోషల్ మీడియాలోవైరల్ అయినప్పుుడు మాత్రం స్పందించి.. తర్వాత ఏవరి పనుల్లో వారు బిజీగా ఉండటం ఎంత వరకు సమంజసం.. న్యాయం కోసం పోరాడాలి.. ఇలాంటి మృగాళ్లకు వెంటనే తగిన శాస్తి జరిగేలా పోరాడాలని అన్నారు. ట్రెండ్‌ అయినప్పుడు మాత్రమే న్యాయం జరిగే రోజు రాకూడదని నేను ప్రార్థిస్తున్నాను.  ప్ర‌తీ చోట ఇలాంటి దారుణాలు జరుగుతున్న విష‌యాలు తెలియ‌జెప్పేందుకు హ్యాష్ ట్యాగ్‌లు పెట్టాల్సి వస్తోందని సెటైర్‌ వేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: