బాలీవుడ్‌ మేకర్స్‌ మహేష్ భట్‌, ముఖేష్‌ భట్‌లతో పాటు హీరోయిన్‌ అలియా భట్‌లపై కేసు నమోదైంది. సడక్‌ 2 సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్న కారణంతో గురువాతం వీరి మీద కేసు వేశారు. సికందర్‌ పూర్ కు చెందిన ఆచార్య చంద్ర కిశోర్‌ పరాషర్ అనే వ్యక్తి అడ్వకేట్‌ సోను కుమార్‌ ద్వారా ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.

 

కేసు విచారణకు అంగీకరించిన చీష్‌ జుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ముకేష్‌ కుమార్‌ జూలై 8న విచారణ జరుపుతామని వెల్లడించారు. ఐసీసీ సెక్షన్‌ ల 295ఏ, 120బీ కేసును నమోదు చేశారు. సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో కైలాస్‌ మానస సరోవర్‌ నుచూపించినందుకు ఈ  కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.

 

సడక్ 2 సినిమాను 1990లో బ్లాక్‌ బస్టర్ హిట్‌ అయిన సడక్‌ సినిమాకు సీక్వెల్‌గా రూపొందించారు. ముఖేష్ భట్‌ నిర్మిస్తున్న ఈ సినిమాతో మహేష్ భట్‌ రెండు దశాబ్దాల తరువాత దర్శకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దర్శకుడి కూతురు అలియాతో పాటు ఈ సినిమాతో సంజయ్‌ దత్‌, పూజా భట్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 1991లో రిలీజ్‌ అయిన సడక్‌ సినిమాలోనూ సంజయ్‌, పూజాలు జంటగా నటించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

When you come to the end, you discover that there is no END.

A post shared by mahesh Bhatt (@maheshfilm) on

మరింత సమాచారం తెలుసుకోండి: