డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది. మొదటిలో ఈ సినిమాని పాన్ ఇండియా తరహాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ని హీరోగా పెట్టి తెరకెక్కించడానికి పూరి రెడీ అవ్వడం జరిగింది. అంతేకాకుండా అధికారికంగా కూడా టైటిల్ ప్రకటించడం జరిగింది. కానీ ఆ తర్వాత పూరి జగన్నాథ్ వరుస ఫ్లాపుల్లో కి వెళ్లిపోవడంతో మరోపక్క మహేష్ వేరే ఇతర ప్రాజెక్టుల బిజీ అవడంతో జనగణమన ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే గత ఏడాది జులై 18వ తారీకు ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమాతో అదిరిపోయే సూపర్ డూపర్ హిట్ అందుకున్న పూరి జగన్నాథ్, పలు ఇంటర్వ్యూలలో మళ్లీ జనగణమన ప్రాజెక్టు తెరపైకి తీసుకువచ్చారు.

ఇది ప్రత్యేకంగా మహేష్ బాబు ని హీరోగా దృష్టిలో పెట్టుకుని సినిమా కథ రాయటం జరిగింది అంటూ ఇటీవల వెల్లడించారు. అయితే మరోసారి ఈ ప్రాజెక్టు గురించి పూరి మరియు మహేష్ మధ్య డిస్కషన్ జరగగా స్టోరీ నచ్చకపోవడంతో పూరి ఈ ప్రాజెక్టును పక్కన పెట్టినట్లు సమాచారం. మహేష్ బాబు కోసం మరో కథ రెడీ చేయాలని డిసైడ్ అయ్యారట.

IHG

కానీ జనగణమన మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కనుక కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ని హీరోగా పెట్టి తెరకెక్కించడానికి పూరిజగన్నాథ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు, దానికోసం స్టోరీలో కొద్దిగా మార్పులు చేయడానికి పూరి జగన్నాథ్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మరి పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన కి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: