హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మహేష్ ఒక మిలిటరీ మేజర్ పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆయన సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సంక్రాంతి సందర్భంగా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత వాస్తవానికి మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లితో మహేష్ ఒక సినిమా చేయవలసి ఉంది. 

IHG

అయితే కథ పూర్తిగా సిద్ధం కాకపోవడం వలన అతడి స్థానంలో మరొక యువ దర్శకుడు పరశురాంతో సర్కారు వారి పాట సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు సూపర్ స్టార్. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకులు, అభిమానుల నుండి విశేషమైన స్పందన లభించింది. అతి త్వరలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా తరువాత మహేష్ బాబు, దర్శక దిగ్గారం ఎస్ ఎస్ రాజమౌళితో ఒక సినిమా చేయవలసి ఉంది. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే, ఆ సినిమాకు బ్రేక్ పడనున్నట్లు చెప్తున్నారు. అయితే అది శాశ్వతంగా కాదు, మరికొంత ఆలస్యం అవుతుందని అంటున్నారు. 

 

అందుతున్న సమాచారాన్ని బట్టి, సర్కారు వారి పాట సినిమా కొంత షూటింగ్ పూర్తి అవగానే, మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమాని కూడా లైన్లో పెట్టనున్నట్లు టాక్. మొత్తంగా ఒకదాని తరువాత మరొకటిగా ఇవి రెండూ పూర్తి అయిన తరువాతనే మహేష్, రాజమౌళి సినిమా చేస్తారని సమాచారం. దీనిని బట్టి మహేష్, రాజమౌళిల కాంబోలో రానున్న సినిమా వచ్చే ఏడాది చివర్లో గాని, లేదా ఆపై ఏడాదిలో గాని పట్టాలెక్కే ఛాన్స్ లేదని అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఎటువంటి అధికారిక సమాచారం లేదని, కానీ ఒకవేళ ఇదే కనుక నిజం అయితే, వీరిద్దరి క్రేజీ కాంబోలో రానున్న సినిమా చూడడానికి ప్రేక్షకులు, అభిమానులు ఇంకొన్నాళ్ళు ఆగకతప్పదని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: