బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ లను ఇక్కడికి తీసుకుని వచ్చి తెలుగు లో సినిమాలు చేసి అవి పాన్ ఇండియా లెవెల్ కి తీసుకుని వెళ్లి మంచి కమర్షియల్ గా హిట్ కొట్టి స్టార్ నిర్మాత అయిపోవాలి అనే ఆలోచన చేసారు కొంత మంది మన తెలుగు లో అనే విషయం అందరికి తెలిసిందే. స్టార్  నిర్మాత అయిపోవాలి అని భారీ బడ్జెట్ సినిమాలను బాలీవుడ్ హీరోయిన్ లతో ప్లాన్ చేస్తూ వచ్చారు. దీపిక పదుకొనే ప్రియాంకా చోప్రా శ్రద్దా కపూర్ వంటి స్టార్ హీరోయిన్ లను సినిమాల్లోకి తీసుకుని వచ్చే ఆలోచన చేసారు. 

 

కాని ఇప్పుడు అంత సినిమా... సినిమాకు లేదు అనే చెప్పాలి. ఇప్పుడు ఇష్టం వచ్చిన విధంగా ఖర్చులు చేస్తే సినిమాను చూసే వారు చాలా తక్కువగా ఉంటారు అని కరోనా భయం తో ఎవరూ కూడా హాల్ కి వెళ్ళే అవకాశం లేదు అని వాళ్ళను ఇక్కడికి తీసుకుని వచ్చి కోట్లకు కోట్లు బడ్జెట్ ఇచ్చి సినిమాలు చేస్తే నానా రకాల బాధలు తర్వాత పడాల్సి వస్తుంది అని నిర్మాతల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు అని అంటున్నారు సినీ జనాలు. గతంలో మాదిరిగా సినిమాల పరిస్థితి ఉండే అవకాశ౦ అయితే లేదు అనే చెప్పాలి. 

 

అందుకే ఇప్పుడు ఎంత తక్కువగా సినిమాలు చేస్తే అంత మంచిది అనే విషయం చాలా వరకు తెలుసుకుని సినిమాలు చేయడం అనేది అవసరం. ఇష్టం వచ్చినట్టు సినిమాలు చేస్తే మాత్రం ఇప్పుడు నానా బాధలు పడాల్సిన అవసర౦ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక రెండు మూడేళ్ళ పాటు జాగ్రత్తలు లేవు అంటే మాత్రం ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగానే ఇతర భాషల వారిని పక్కన పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: