టాలీవుడ్ లో సినిమాలు అనగానే స్టార్ హీరోలకు భారీగా రేటు ఉంటుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్ ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా చాలా మంది హీరోలకు భారీగా లాభాలు అనేవి ఇస్తూ ఉంటారు. సినిమాలో ఉండే చాలా వరకు సన్నివేశాల విషయంలో వారికి ప్రత్యేక రేటు కూడా ఉంటుంది అంటారు. ఇక మహేష్ బాబు ఎన్టీఆర్ వంటి వారు ప్రభాస్ వంటి వారు దాదాపు 30 కోట్ల వరకు సినిమా కోసం తీసుకుని సినిమా చేస్తున్నారు.  మహేష్ బాబు అయితే ఆ సంఖ్యను 50 కోట్ల వరకు తీసుకుని వెళ్ళాడు. ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ కోసం 60 కోట్ల వరకు తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. 

 

ఇక రామ్ చరణ్ కూడా 40 వరకు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ప్రభాస్ అయితే సాహో సినిమా కోసం గానూ 60 కోట్ల వరకు తీసుకున్నాడు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి ఏ మాత్రం కూడా లేదు అనే విషయం స్పష్టంగా చెప్పాలి. ఎందుకు అంటే నిర్మాతలు కష్టాల్లో ఉన్నారు. కనీసం 30 శాతం అయినా సరే వారి పారితోషికం విషయంలో కోత అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారి బడ్జెట్ విషయంలో కూడా భారీగా తగ్గించే సూచనలు కూడా ఉన్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పాలి  మరి. కరోనా దెబ్బకు అసలు జనాలు హాల్ కి వచ్చి సినిమా చూస్తారా లేదా అనేది చెప్పడం చాలా కష్టం. 

 

అందుకే పారితోషికం విషయంలో కూడా ఒకటికి వంద సార్లు ఆలోచన చేసిన అడుగులు  వేస్తున్నారు అని  టాక్ మహేష్ బాబు అయితే స్వయంగా తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేస్తాను అని చెప్పాడు అని అంటున్నారు. మరి అసలు ఏమవుతుంది ఏంటీ అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: