మెగాస్టార్ చిరంజీవి కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సమాజంలో సేవా కార్యక్రమాలు పలు చారిటీ సంస్థల తరపున పేద వారిని మరియు మూగజీవాలను ఆదుకోవడంలో ముందుంటారు అని అందరికీ తెలుసు. అంతేకాకుండా తేడా వస్తే ప్రశ్నించడం లో కూడా ముందు వెనకా చూడక ఉపాసన ముక్కుసూటిగా కూడా మాట్లాడతారు. ఓ సారి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సమావేశం అని చెప్పి బాలీవుడ్ ఇండస్ట్రీ తో ప్రధాని సమావేశం అవటాన్ని ఇండియాలో ఎవరు ప్రశ్నించని సమయంలో ఉపాసన ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమేనా అంటూ ఏకంగా మోడీని అప్పట్లో ప్రశ్నించడం జరిగింది.

 

ఆ విధంగా చాలా విషయాల గురించి స్పందించే ఉపాసన మరోపక్క సమాజంలో ప్రజలు ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఇంకా అనేక విషయాల గురించి అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. లాక్డౌన్ టైములో ఫిలింనగర్లో సినిమా కార్మికులకు తన సొంత సంస్థ అపోలో మెడికల్ షాప్ ద్వారా ఉచితంగా మెడిసిన్స్ పంచడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల ఉపాసన శ్రీశైలం గుడి ని దర్శించుకున్న తర్వాత ఆమె చేసిన పనికి మెగా అభిమానులు ఫిదా అయిపోయారు. అదేమిటంటే భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత ఉపాసన శ్రీశైలం అడవుల్లో ఉండే గిరిజనుల దగ్గరకు వెళ్ళటం జరిగింది.

 

వాళ్ల ఆహారపు జీవన విధానాన్ని మొత్తం తెలుసుకున్న ఉపాసన వారికి నిత్యావసర సరుకులు అందజేసి కొంతమేర ఆర్థిక సాయం కూడా చేసినట్లు సమాచారం. అంతేకాకుండా అది ట్రైబల్ ఏరియా కాబట్టి అక్కడ ఎక్కువగా అంటురోగాలు ప్రబలే అవకాశం ఉండటంతో వాటి నుండి ఎలా తప్పించుకోవాలి అనే విషయంలో వారికి అవగాహన కల్పించే విధంగా ఉపాసన కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో మెగా అభిమానులు ఉపాసన పై పొగడ్తలు వర్షం కురిపిస్తున్నారు. చిరంజీవి కి తగ్గ సరైన కోడలు ఉపాసన అంటూ కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: