ఓ పక్క ఇండస్ట్రీ లో నెపోటిజం మీద హాట్ చాట్ గా చర్చలు నడుస్తుండగా మరోపక్క సిని వారసత్వం కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు హీరో తనయులు మాత్రమే హీరోలుగా చేసే వారు కాని ఇప్పుడు డైరక్టర్ తనయులు కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్ర్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన సతెష్ వేగేశ్న తాయుడు హీరోగా పరిచయం కాబోతున్నాడని తెలుస్తుంది. దొంగల బండి సినిమాతో దర్శకుడిగా మారిన సతీష్ వేగేశ్న శతమానంభవతి సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

 

ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం, ఎంతమంచి వాడవురా సినిమాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ అవలేదు. ప్రస్తుతం తన డైరక్షన్ లో సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే అల్లరి నరేష్ నటిస్తున్న నాంది సినిమాకు సతీష్ వేగేశ్న స్క్రిప్ట్ సపోర్ట్ తో పాటుగా ఆ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నాడు. ఇక ఇప్పుడు తనయుడిని హీరోగా పరిచయం చేసే పనిలో ఉన్నాడు సతీష్ వేగేస్న. అందుకోసం తనే ఓ అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే తెరకెక్కే ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తారని తెలుస్తుంది.

 

కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో దిల్ రాజు ఎప్పుడు ముందు ఉంటారు. అందుకే డైరక్టర్ సతీష్ కొడుకుని ఇంట్రడ్యూస్ చేసేందుకు ఓకే చెప్పినట్టు టాక్. మరి ఇండస్ట్రీకి రాబోతున్న మరో డైరక్టర్ తనయుడు ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటాడో చూడాలి. మొదటి రెండు అవకాశాలు తండ్రి డైరక్టర్ కాబట్టి వచ్చినా ఆ తర్వాత మాత్రం సొంత టాలెంట్ తో ఛాన్సులు అందుకోవాల్సిందే. మరి ఆ సత్తా అతనిలో ఉందో లేదో సినిమా వస్తేనే కాని చెప్పలేం.                        

మరింత సమాచారం తెలుసుకోండి: