కరోనా పరిస్థితులు అడ్డు రాకుండా ఉండి ఉంటే ఈపాటికి సుకుమార్  అల్లు అర్జున్ కాంబినేషన్ మూవీ ‘పుష్ప’ షూటింగ్ మొదలై ఉండేది. శేషాచలం అడవులలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలోజరిగే ఈ కథలో అల్లు అర్జున్ చిత్తూర్ యాసలో నటిస్తూ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈమూవీకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలకు లీక్ అయింది.  


‘పుష్ప’ మూవీలో కథానుగుణంగా అల్లు అర్జున్ కు ఇద్దరు సోదరులు ఉంటారని తెలుస్తోంది. వారిలో ఒకరు గ్రామ సర్పంచ్ గా కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు కూడ ‘రంగస్థలం’ సినిమాలోని గ్రామ రాజకీయాలు కక్షలు ప్రధాన అంశాలుగా ఉంటాయని తెలుస్తోంది.


దీనితో ‘రంగస్థలం’ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ సుకుమార్ ఆది పినిశెట్టిని బన్ని అన్న పాత్రకు ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.   ఇదే సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ సోదరుడు పాత్ర కోసం మరో యంగ్ హీరోతో చర్చలు జరిపుతున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించిన ఫారెస్ట్ సీన్స్ ను రామోజీ ఫిలిం సిటీలో ఒక కృత్రిమ ఫారెస్ట్ క్రియేట్ చేసి షూట్ చేయాలి అన్న ప్రతిపాదనా లపై సుకుమార్ పూర్తిగా ఇష్టపడటం లేదు అని తెలుస్తోంది.  


ఈసినిమాలో క్రేజీ బ్యూటీ రష్మిక పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తున్న పరిస్థితులలో ఆమెకు ఈ లాక్ డౌన్ సమయంలో సుకుమార్ నటనకు తెలంగాణా యాసకు సంబంధించిన క్లాసులు ప్రతిరోజు ఇప్పిస్తూ సుకుమార్ ఒక కొత్త రష్మికను ఈ మూవీలో చూపించడానికి చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అదే విధంగా ఈ మూవీలోని పాటల ట్యూన్స్ చాలా క్యాచీ గా ఉండాలి అన్న ఉద్దేశంతో సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్  నుండి మంచి ట్యూన్స్ రాబట్టడానికి దేవి శ్రీ మైండ్ ను టార్చర్ పెడుతున్నట్లు టాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: