యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌కు గ‌తేడాది ఏ మాత్రం క‌లిసి రాలేదు. త‌న తండ్రి ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆథారంగా తెర‌కెక్కిన ఎన్టీఆర్ క‌థా నాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక యేడాది చివ‌ర్లో చేసిన రూల‌ర్ సినిమా కూడా డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో బాల‌య్య ఇప్పుడు త‌న‌కు కలిసి వ‌చ్చిన డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన సింహా, లెజెండ్ రెండూ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు వీరి కాంబో ఖ‌చ్చితంగా హ్యాట్రిక్ కొడుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

 

ఇక ఇటీవ‌ల రిలీజ్ అయిన డైలాగ్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది.  ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనేదానికి, శీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనేదానికి చాలా తేడా ఉందిరా లండీ కొడకా అని బాలయ్య చెప్పిన మాస్ డైలాగ్ బాగా సెన్షేష‌న్ అయ్యింది. ఇక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో వాయిదా ప‌డింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కొద్ది రోజులుగా అన్వేష‌ణ కొన‌సాగుతోంది.

 

ముందుగా హీరోయిన్ రోల్ కోసం కేథ‌రిన్ థెస్రా, రాహీ ఖన్నా, శ్రియ చ‌ర‌ణ్‌ ఇలా పలువురు పేర్లు వినిపించినా అవేవి ఫైన‌ల్ కాలేదు. ఇప్పుడు తాజా స‌మాచారం ప్ర‌కారం సౌత్ ఇండియ‌న్ బోల్డ్ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న అమ‌లాపాల్ పేరు విన‌ప‌డుతోంది. బోయ‌పాటి టీం అమ‌ల‌ను సంప్ర‌దించ‌గా ఆమె దాదాపు ఓకే చేసింద‌ని అంటున్నారు. అన్నీ కుదిరితే బాలకృష్ణఅమల పాల్ జోడీ కడతారు. అంజలి ఓ ప్రముఖ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి మిర్యాల రవీందర్ నిర్మాత.

మరింత సమాచారం తెలుసుకోండి: