బాహుబలి సీరిస్ సినిమాలు, సాహో సినిమాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ బాలీవుడ్ లో ఓ రేంజ్లో ఉంది. సాహో సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో ప్లాప్ అయినా కూడా బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు మంచి వసూళ్లు రాబట్టింది. దీనిని బట్టి ప్రభాస్కు బాలీవుడ్లో ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ మూవీగా తెరకెక్కే ఈ సినిమాకు రాధే శ్యామ్ టైటిల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ప్రభాస్ మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందట. ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. తానాజీ సినిమాను తెరకెక్కించిన ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ బాలీవుడ్ మూవీ ఉండనుందట.
ప్రభాస్ బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో సినిమా తీస్తే ఈ సినిమాను ఇటు సౌత్లో కూడా రిలీజ్ చేయవచ్చని.. మార్కెట్ కూడా పెద్ద ఇబ్బంది ఉండదని బాలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నారట. భారీ బడ్జెట్ తో ఓం రౌత్ దర్శకత్వంలో ఛారిత్రాత్మక నేపథ్యంలో సినిమాను చేయాలని భావిస్తున్నారట. యూవీ క్రియేషన్స్ వారు బాలీవుడ్ ఫేమస్ నిర్మాణ సంస్థతో కలిసి ప్రభాస్ బాలీవుడ్ సినిమాను నిర్మించబోతున్నారని సమాచారం. 2022 చివర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందకు ప్లాన్ చేస్తున్నారు.