తెలంగాణలో రోజురోజుకు కరోనా  వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. సామాన్యులు సెలబ్రిటీలు నాయకులు అధికారులు అనే తేడా లేకుండా అందరికీ సోకుతూ అందరిలో ప్రాణ భయం కలిగిస్తోంది. ఇప్పటికే ఎంతోమంది ఎమ్మెల్యేలు పోలీస్ అధికారులు సైతం కరోనా  వైరస్ బారిన పడటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా కరోనా వైరస్ బారిన పడుతుండడం మరింత సంచలనం గా మారిపోయింది. ముఖ్యంగా బుల్లితెరపై ఈ మహమ్మారి వైరస్ పంజా విసురుతుంది అనే చెప్పాలి. 


 గత కొన్ని రోజుల నుంచి బుల్లితెర నటులను  ఈ మహమ్మారి రక్కసి వెంటాడుతూనే ఉంది. వరుసగా బుల్లితెర నటులు కరోనా  వైరస్ బారిన పడుతున్నారు. ఇక తాజాగా మరో బుల్లితెర నటుడు కరోనా  వైరస్ బారిన పడ్డారు. బుల్లితెర  హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికృష్ణ  ఆ తర్వాత బిగ్ బాస్ ద్వారా కూడా ఇంకా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే తాజాగా తాను పరీక్షలు నిర్వహించకోగ..  కరోనా వైరస్ పాజిటివ్ అని  నిర్ధారణ అయినట్లు రవికృష్ణ సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. 


 దీంతో తాను మూడు రోజుల్నుంచి ఇంట్లోనే ఉంటూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు నటుడు రవి కృష్ణ. గత కొన్ని రోజుల నుండి తనతో కాంటాక్ట్ అయిన వాళ్ళు కూడా కొన్ని రోజుల వరకు ఇంట్లోనే ఉండి  కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఇంస్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. అయితే ఇటీవలే బుల్లితెర షూటింగులు మొదలైన నేపథ్యంలో ఇలా వరుసగా బుల్లితెర నటులు కరోనా  వైరస్ బారిన పడుతున్నారు. ఇకపోతే మొగలిరేకులు తో తెలుగు బుల్లితెర ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రవికృష్ణ ఆ తర్వాత వరూధిని పరిణయం శ్రీనివాస కళ్యాణం అనే  ధారావాహికల్లో నటించి నటనతో ఎంతగానో గుర్తింపు సంపాదించారు,

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rᴀᴠɪ ᴋʀɪsʜɴᴀ (@ravikrishna_official) on

మరింత సమాచారం తెలుసుకోండి: