ముగ్గురు మొనగాళ్లు, ముఠామేస్త్రి, బిగ్ బాస్ సినిమాలలో రోజా చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించడం జరిగింది. ఆ తర్వాత ఇంకెప్పుడూ వీళ్లిద్దరూ కలిసి నటించలేదు. ఇదిలాఉండగా త్వరలో చిరంజీవి నటించబోయే సినిమాలో రోజా నటిస్తున్నట్లు ఫిలింనగర్ నుండి వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే ప్రస్తుతం రోజా ఒక పక్క బుల్లితెరపై అలరిస్తూనే మరో పక్క రాజకీయాలు కూడా చేస్తోంది.

 

వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించిన రోజా ప్రత్యర్థులను మీడియా ముందు విమర్శించడంలో అసెంబ్లీలో అడ్డుకోవడంలో తనను మించిన వారు లేరు అన్నట్టుగా అద్భుతమైన మాట తీరుతో ప్రత్యర్థి నాయకులను ఉక్కిరిబిక్కిరి చేస్తది అన్న టాక్ ఉంది. ఏపీఐఐసీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న రోజా త్వరలో ఏపీ లో జరగబోయే కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి పొందుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు.

 

సినిమా అయిన వెంటనే ‘లూసీఫర్’ సినిమా తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో అనగా చిరంజీవి చెల్లెలు క్యారెక్టర్ లో రోజా నటించనున్నట్లు, ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లు ఇండస్ట్రీ లో వార్తలు వస్తున్నాయి. చాలా కాలం తర్వాత మళ్లీ చిరంజీవి పక్కన రోజా నటించడానికి రెడీ అయినట్లు వార్తలు రావటంతో మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. కాగా మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన చిరంజీవి... విజయశాంతి తో మళ్లీ కలిసి నటించాలని ఓపెన్ గానే కామెంట్లు చేయడం జరిగింది. తాజాగా రోజా తో చిరంజీవి సినిమా కన్ఫర్మ్ అయినట్లు వార్తలు రావడంతో పాత మెగా కాంబినేషన్లు మళ్లీ రిపీట్ అవుతున్నాయని సినిమా ప్రేమికులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: