ముందుగా గ్రహణం అనే చిన్న సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లో తన సినీ ప్రస్థానం మొదలెట్టిన యువ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, ఆపై మాయాబజార్ సినిమా కూడా తీశారు. ఆ తరువాత నాని, కలర్స్ స్వాతి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కించిన అష్టాచమ్మా సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు.  ఇక ఇటీవల మరొక్కసారి నానితో జెంటిల్ మ్యాన్ సినిమా తీసి మరొక హిట్ కొట్టిన ఇంద్రగంటి, రెండేళ్ల క్రితం సుధీర్ బాబుతో సమ్మోహనం సినిమా తీసి మరొక మంచి విజయాన్ని అందుకున్నారు. 

IHG

ఇక ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబులు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ తీస్తున్న లేటెస్ట్ మూవీ వి. మంచి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందనను సంపాదించడంతో పాటు సినిమా పై భారీగా అంచనాలు క్రియేట్ చేసింది. టీజర్ ని బట్టి చూస్తే సుధీర్ బాబు సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, నాని నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సైరా సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని వాస్తవానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో కలిసి చేయాలని భావించారట ఇంద్రగంటి. 

 

ఇదే విషయాన్ని ఇటీవల హీరో సుధీర్ బాబు ఒక ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పడం జరిగింది. ఈ సినిమా కథలో ఎంతో మంచి డెప్త్ ఉందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఇద్దరు హీరోల క్యారెక్టర్లను దర్శకుడు తీర్చిదిద్దారని, అయితే ఒక్కోసందర్భంలో మనం అనుకున్నవి అన్ని కుదరకపోవచ్చని, ఆ విధంగా ఆ సూపర్ స్టార్స్ ఇద్దరూ కూడా చేయడం కుదరని ఈ సినిమాని నేను, నాని కలిసి చేస్తున్నాం అని అన్నారు సుధీర్ బాబు. ఆయన చెప్పినట్లు నిజంగా ఈ సినిమా కనుక మహేష్, పవన్ కనుక చేస్తే బాక్సాఫీస్ గత రికార్డులన్నీ బద్దలవడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు మరియు వారిద్దరి అభిమానులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: