వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ సమయంలో రెండు సినిమాలను రూపొందించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమాలు చెత్త గా ఉన్నప్పటికీ తాను మాత్రం తన పాపులారిటీ తో కోట్ల రూపాయలు సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం ఈ సినిమాలు మాత్రమే కాదు ఇంకా రెండు మూడు సినిమాలు కూడా తను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అమృత ప్రణయ్ ప్రేమ గాధ పైన మర్డర్ అనే ఒక మూవీని, పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర పై పవర్ స్టార్ అనే ఒక సినిమాని, కరోనా అనే పేరుగల మరొక సినిమాని, 12'O క్లాక్ అనే ఒక హారర్ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ నగరంలోని మొయినాబాద్ లో చిత్రీకరిస్తున్నాడు.


అయితే ఈ నాలుగు సినిమాలను ఒకే సారి చిత్రీకరించబోతున్నారు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం సినీ ప్రముఖులంతా తమ సినిమాల చిత్రీకరణను ప్రారంభించాలంటేనే జంకుతున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం తనని కరోనా ఏమి చేయలేదని, కరోనా తనని ఆపలేదని చెబుతున్నాడు. రెండు శృంగార భరితమైన సినిమాలు తీసి బాగా డబ్బులు సంపాదించి వాటిని మంచి సినిమాల షూటింగ్ ల కొరకు రాంగోపాల్ వర్మ వాడుతున్నాడు.


అమృత ప్రణయ్ నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న క్రమంలో తమ ఫోటోలు వాడారని అమృత తరుపు వాళ్ళు రామ్ గోపాల్ వర్మ పై మిర్యాలగూడలో కేసు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా సినిమా ప్రారంభం అవ్వకముందే రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించే ఈ నాలుగు సినిమాల్లో రెండు సినిమాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఈ 4 సినిమాలు శ్రేయాస్ ఈటీ యాప్/ ఆర్జీవి వరల్డ్ థియేటర్ లో డిజిటల్ రిలీజ్ అవ్వనున్నాయి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: