రాజమౌళితో సినిమా ఎంత ఎక్సయిట్ మెంట్ గా ఉంటుందో.. ఆ తర్వాత ప్రాజెక్ట్ పై అంత టెన్షన్ ఉంటుంది. జక్కన్న ఇచ్చిన బ్లాక్ బస్టర్ ని కంటిన్యూ చేయడం ఎలా అనే ఆలోచనలు ఎక్కువవుతాయి. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఇలాంటి సిట్యూయేషన్ లోనే ఉన్నాడు. దీంతో రాజన్న సెంటిమెంట్ ని బ్రేక్ చేసేందుకు కొత్త ప్లాన్స్ వేస్తున్నాడు చరణ్. 

 

రాజమౌళి సినిమా అంటే హిట్ గ్యారెంటీ అని డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఫిక్స్ అవుతారు. అందుకే హీరోలు కూడా జక్కన్న పిలుపు కోసం ఎదురుచూస్తుంటారు. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అయితే ట్రిపుల్ ఆర్ సూపర్, డూపర్ హిట్ అని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ ఎక్స్ పెక్టెడ్ హిట్ తర్వాత ఏ సినిమా చేయాలనే విషయంలో తారక్ కు ఓ క్లారిటీ వస్తే, చరణ్ మాత్రం తేల్చుకోలేకపోతున్నాడు.

 

జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ తో కలిసి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇక తారక్ తర్వాత మూవీ విషయంలో క్లారిటీగా ఉంటే.. చరణ్ మాత్రం రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసేందుకు ఏ డైరెక్టర్ ని కాంటాక్ట్ చేయాలి. ఎలాంటి స్టోరీలో నటించాలి అని మేథోమథనాలు చేస్తున్నాడు. 

 

రాజమౌళితో సినిమా చేశాక ఏ హీరోకైనా తర్వాతి మూవీ ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో అంతగా మెప్పించలేదు. రామ్ చరణ్ మగధీర తర్వాత నటించిన ఆరెంజ్ చాలా అడ్వాన్స్ డ్ స్టోరీ అనే టాక్ తో ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. అందుకే ట్రిపుల్ ఆర్ తర్వాత ఓ యూనిక్ స్టోరీ చేయాలనుకుంటున్నాడట చరణ్. రీసెంట్ గా ఓ కొత్త డైరెక్టర్ కూడా రామ్ చరణ్ కు స్టోరీ నెరేట్ చేశాడనీ.. చెర్రీకి ఈ లైన్ బాగా నచ్చిందనీ.. బౌండ్ స్క్రిప్ట్ కూడా ఎక్సయిటింగ్ గా ఉంటే.. చరణ్ అతనితోనే సినిమా చేేసే అవకాశం కూడా ఉందంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: