బాహుబలి సృష్టించిన ప్రభంజనంతో  ప్రపంచస్థాయిలో ఎన్నెన్నో ప్రశంసలు అందుకున్న  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... టాలీవుడ్ విడిచి వెళ్లబోతున్నారా? అంటే ఆయన బాలీవుడ్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం చూస్తే అవుననే అనిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ తన 20వ చిత్రమైన 'రాధే శ్యామ్' జిల్ దర్శకుడు రాధాకృష్ణతో కలిసి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగింది. ఇక ప్రస్తుతం షూటింగులకు నిబంధనలతో కూడిన అనుమతులు ఇవ్వడంతో... సినిమాల చిత్రీకరణ మొదలయ్యింది. దీంతో లాక్ డౌన్ తర్వాత ప్రభాస్ సినిమా కోసం హైదరాబాద్‌లోనే ఫారెన్ మాదిరి సెట్స్ వేసి కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నట్టు టాక్.  

ఇక ప్రభాస్ తన 21వ చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ తో కలిసి చేయబోతోన్న సంగతి విధితమే. అటు 22వ సినిమా మాత్రం తమతోనే చెయ్యాలని బాలీవుడ్ నిర్మాతలెందరో పోటీ పడుతున్నారు. అందులోనూ మరీ ముఖ్యంగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ ప్రభాస్ కు చాలా కథలు వినిపిస్తోంది. తాన్హాజీ దర్శకుడు ఓం రౌత్ చెప్పిన కథ ప్రభాస్‌కు బాగా కనెక్ట్ అయ్యిందట. దీనితో పాటు ప్రభాస్‌కు మరిన్ని కథలు చెప్పేందుకు బాలీవుడ్ దర్శకులు క్యూ కట్టినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితిలోనూ రెబల్ స్టార్‌తో సినిమా తీయాలనే పట్టుదలతో ఉన్న టీ-సిరీస్ ఇప్పట్లో మన ప్రభాస్‌ని వదిలేలా లేదు. ప్రభాస్ కూడా 22వ సినిమాని బాలీవుడ్ చేయడానికి సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక దీని తర్వాత కూడా మరిన్ని కథలు నచ్చితే బాలీవుడ్‌లోనే సినిమాలు తీసే అవకాశముంది. మొత్తానికైతే ప్రభాస్ టాలీవుడ్ వదిలేసి టోటల్‌గా బాలీవుడ్ వైపు వెళ్లిపోయేలా కనిపిస్తున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: