టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, భీష్మ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా తర్వాత నితిన్ నుండి వస్తున్న చిత్రం రంగ్ దే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాతో పాటు అతడి చేతిలో ఇంకా మూడు సినిమాలున్నాయి. బాలీవుడ్ అంధాధున్ తెలుగు రీమేక్ ఒకటి కాగా, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో చిత్రం.. ఇంకా క్రిష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట.

 

ఈ మూడు సినిమాల్లో రంగ్ దే తర్వాత అంధాధున్ తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే అంధాధున్ తో పాటు పవర్ పేట పనులు కూడా స్టార్ట్ అయ్యాయట. దర్శకుడు క్రిష్జ చైతన్యసినిమా పనులు ప్రారంభించారట. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించనుందని, రంగ్ దే తర్వాత నితిన్ తో మళ్ళీ రొమాన్స్ చేయబోతుందని వార్తలు వచ్చాయి.

 

తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ బయటకి వచ్చింది. నితిన్ పవర్ పేటలో మరో యాక్టర్ కూడా నటిస్తున్నాడు. మొదట పెద్దగా ప్రాముఖ్యం లేని చిన్న చిన్న పాత్రల్లో మెరిసి, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతి లక్ష్మీ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్, బ్లఫ్ మాస్టర్ సినిమాతో హీరోగా మారాడు. అయితే  ఆ సినిమా అతడికి హీరోగా పెద్దగా గుర్తింపు తీసుకురాకపోయినప్పటికీ నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది.

 

 

అయితే ప్రస్తుతం నితిన్ పవర్ పేటలో సత్యదేవ్ కూడా నటిస్తున్నాడట. హీరోగా ఇప్పుడిప్పుడే అవకాశాలు తెచ్చుకుంటున్న సత్యదేవ్, నితిన్ హీరోగా నటిస్తున్న పవర్ పేటలో ఎలా మెప్పిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: