విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో చిత్రం నారప్ప. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. వచ్చే నెల నుండి మిగిలిన షూటింగ్ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రంలో వెంకీ సతీమణిగా ప్రియమణి నటిస్తుండగా వారి పెద్ద కొడుకుగా, మునికన్నా పాత్రలో కార్తీక్ రత్నం నటిస్తున్నాడు. ఈరోజు కార్తీక్ రత్నం పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా నుండి అతని ఫస్ట్ లుక్ ను విడుదలచేసి చిత్ర బృందం విషెస్ తెలిపింది. కార్తీక్ రత్నం ఇంతకుముందు సూపర్ హిట్ మూవీ కేరాఫ్ కంచెరపాలెంలో నటించాడు. 
కోలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ మూవీ అసురన్ రీమేక్ గా తెరక్కుతున్న నారప్పకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా సురేష్ బాబు ,కలైపులి ఎస్ థాను కలిసి నిర్మిస్తున్నారు. ఈఏడాది చివర్లో ఈ సినిమా విడుదలకానుంది. ఇక ఒరిజినల్ వెర్షన్ లో ధనుష్ ,మలయాళ నటి మంజూ వారియర్ లీడ్ రోల్స్ లో నటించగా గత ఏడాది విడుదలైన ఈ చిత్రం 70కోట్ల వసూళ్లను రాబట్టి బాక్సఫీస్ ను షేక్ చేసింది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెట్రి మారన్ అసురన్ ను డైరెక్ట్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: