అలవైకుంఠపురములో సినిమాతో నాన్ బాహుబలి రికార్డు నెలకొల్పిన బన్నీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసాడు. రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి పుష్ప అనే టైటిల్ ని పెట్టారు. అయితే కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు.

 

 

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాల్ అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. బన్నీ కెరీర్లో తెరకెక్కుతున్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం కావడంతో మేకర్స్ చాలా ప్లానింగ్ తో ఉన్నారు. అయితే ఈ సినిమా అనంతరం బన్నీ ఐకాన్ చిత్రం చేయనున్నాడని అన్నారు. తాజా సమాచారం ప్రకారం బన్నీ కొత్త స్క్రిప్టు కోసం చూస్తున్నాడట.

 

 

ఈ నేపథ్యంలో హీరో నానీని వెండితెరకి పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని అన్నారు. ఇంద్రగంటి ప్రస్తుతం నాని హీరోగా వి అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. కరోనా కారణంగా ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. అయితే ఇంద్రగంటి ఓ ప్రముఖ నిర్మాతతో కలిసి బన్నీకి స్క్రిప్టు వినిపించాడని టాక్. బన్నీకి కూడా స్క్రిప్టు నచ్చిందట.

 

 

కానీ ఇంద్రగంటి ఇప్పటి వరకు అన్నీ సెన్సిబుల్ చిత్రాలే తీశాడు. అల్లు అర్జున్ కి మాస్ ఫాలోయింగ్ ఎక్కువే. అందువల్ల ఇంద్రగంటి మోహనక్రిష్ణతో సినిమా వద్దనుకున్నాడని చెబుతున్నారు. అయితే వి సినిమా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిందని చెబుతున్నారు. మరి ఆ సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ ఇంద్రగంటితో చేయడానికి ముందుకు వస్తారేమో చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: