కరోనాకు హీరోలే కాదు హీరోయిన్స్ కూడా భయపడిపోతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ ఇప్పట్లో కెమెరా ముందుకు రావద్దనుకుంటున్నారు. అసలు స్టార్సే అడుగుపెట్టనపుడు.. హీరోయిన్స్ రావాల్సిన అవసరం ఉండదు. అందరి భామల కథ ఒకలా ఉంటే.. కాజల్ మాత్రం కరోనాను పట్టించుకోకుండా సెట్స్ పైకి వచ్చేసింది. టింగ్స్ కు పర్మీషన్ వచ్చినా కరోనా విజృంభించడంతో.. ఎవరికి వాళ్లు.. ఇంటికే పరిమితమైపోయారు. కొందరైతే గుమ్మం దాంటి రెండు నెలలు దాటింది. కరోనా తగ్గిన తర్వాతే షూటింగ్స్ కు వస్తామని నిత్యామీనన్ లాంటి హీరోయిన్స్ తెగేసి చెప్పేశారు. 

 

స్టార్స్ అందరూ కరోనాకు భయపడితే.. కాజల్ మాత్రం కెర్ చేయడం లేదు. ఓ యాడ్ షూట్ లో ఆల్ రెడీ పాల్గొంది. ముంబయిలోని స్టూడియోస్ లో ఈ యాడ్ ను చిత్రీకరించారు. ప్రభుత్వం సూచనల మేరకు చిత్ర యూనిట్ మాస్క్ లు.. కిట్లు ధరించి షూటింగ్ లో పాల్గొన్నారు. 

 

కాజల్ ప్రస్తుతం ఆచార్యలో చిరంజీవితో జత కడుతోంది. తమిళంలో భారతీయుడు .. హిందీలో మంబాయి సాగ మూవీలో నటిస్తోంది. సినిమా షూటింగ్స్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదు. ఈ లోగా.. చేసిన యాడ్ షూట్.. కరోనా టైమ్ లో టీజర్ గా కాజల్ కు ఉపయోగపడనుంది. 

 

దీన్ని బట్టి అర్థమయింది ఏంటంటే.. కాజల్ కు డేర్ ఎక్కువ. ప్రపంచమంతా కరోనా దెబ్బకు వణికిపోతోంది. లక్షలాది మంది ప్రజలు కరోనా బారిన పడి హాస్పిటల్ పాలయ్యారు. ఎందరో పిట్టల్లా రాలిపోయారు. ఇక కొందరు పూర్తిగా ఇళ్లకే పరిమితమైతే.. ఇంకొందకు బతుకు దెరువుకోసం జంకుతూ ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఎక్కడ ఎవరి ద్వారా తమకు కరోనా సోకుతుందేమోననే భయం వారిని వెంటాడుతోంది. మాస్క్ ధరించినా.. భౌతిక దూరం పాటించినా.. శుభ్రతను అలవర్చుకున్న వారిని సైతం మహమ్మా వదలడం లేదు. సైలెంట్ గా బాడీలోకి ప్రవేశించి హాస్పిటల్ కు సాగనంపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ ఏమాత్రం భయపడకుండా షూటింగ్స్ లో పాల్గొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: