మహేశ్ బాబుకు అందమైన హీరోయిన్ ను చూడటం చాలా కష్టం. నాజూకు భామను చూసినా.. ఒక్కోసారి ఫేస్ లో తేడా కొట్టి.. వయసులో మహేశ్ కంటే హీరోయిన్ పెద్దదిలా కనిపిస్తోంది. మహేశ్ పక్కన హీరోయిన్ ను వెతకడం కష్టమే అయినా.. విలన్ మాత్రం అందగాడు దొరికాడు. హీరోలు విలన్స్ గా మారుతున్న సీజన్ లో రోజా.. మంబయి లాంటి సినిమాలతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న అరవింద్ స్వామి రామ్ చరణ్ ధృవలో విలన్ గా యు టర్న్ తీసుకున్నాడు. స్టైలిష్ విలనిజంతో సినిమాకు ప్లస్ అయ్యాడు. 

 

స్టైలిష్ అండ్ గుడ్ లుకింగ్ యాక్టర్ అరవింద్ స్వామి మహశ్ సర్కారు వారి పాటలో విలన్ గా నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో ప్రతినాయకుడు బిలీనియర్ కావడంతో రిచ్ పర్సనాలిటీ కోసం సర్చింగ్ స్టార్ట్ చేశాడు దర్శకుడు పరశురామ్. ముందుగా కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ను అనుకున్నారు. మరి ఏమైందో ఏమోగానీ.. ప్రస్తుతం అరవింద్ స్వామి పేరు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. 

 

మహేశ్ బాబు.. అరవింద్ స్వామి.. ఇద్దరూ ఇద్దరే. మరి అరవింద్ స్వామి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో లేదో గానీ.. ధీటైన ప్రతినాయకుడు దొరికినట్టే. ధృవ సినిమాకు అప్పట్లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకన్న ఈ స్టైలిష్ విలన్.. ఆరు కోట్లకు పైగా డిమాండ్ చేసే అవకాశముంది. 

 

మొత్తానికి మహేశ్ బాబు సినిమాలో అరవింద్ స్వామి రచ్చరచ్చ చేయనున్నాడు. హ్యాండ్ సమ్ హీరో అయిన మహేశ్ బాబుకు అదేస్థాయిలో హ్యాండ్ సమ్ విలన్ కూడా ఆ చిత్రంలో నటించబోతున్నాడు. ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగిన అరవింద్ స్వామి ధృవ్ సినిమాలో ప్రతినాయకుడు పాత్రలో ఒదిగిపోయాడు. ఇదే టాలీవుడ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అందుకే మహేశ్ బాబు సినిమాలో అరవింద్ స్వామి విలన్ గా తీసుకోవడంపై ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి ఈ ఇద్దరి మధ్య ఎలాంటి డైలాగులు, ఫైట్ లు ఉంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: