టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి రెండు భాగాలతో దేశవ్యాప్తంగా హీరోయిన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు గడించడం జరిగింది. ఆ తరువాత తెలుగులో ఆమె నటించిన భాగమతి సినిమా కూడా సూపర్ హిట్ కొట్టి అనుష్క పేరును మరింతగా పెంచడం జరిగింది. ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్దంలో ప్రధాన పాత్ర చేస్తున్న అనుష్క, ఆ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా లాక్ డౌన్ విధించబడడంతో సకాలంలో ఆ సినిమా విడుదల కాలేదు. కాగా అతి త్వరలో ఆ సినిమా విడుదలకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 

IHG

ఇక మొదటి నుండి ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేస్తూ ముందుకు సాగిన అనుష్క, ఒక్కసారిగా అరుంధతి వంటి పవర్ఫుల్ సినిమా తరువాత ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేయడానికి ఇష్టపడుతున్నారు. నిశ్శబ్దం టైం లో ఆమెకు చాలా సినిమా అవకాశాలు వచ్చాయని, అయితే అందులో చాలావరకు కూడా అనుష్కకు పెద్దగా నచ్చకపోవడంతో ఆమె వాటిని తిరస్కరించినట్లు టాక్. అంతేకాక అతి త్వరలో ప్రారంభం కానున్న ఒక పెద్ద స్టార్ హీరోయిన్ సినిమాలో హీరోయిన్ గా అనుష్కకు అవకాశం వచ్చిందని, వాస్తవానికి రీమేక్ గా తెరకెక్కనున్న ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకు దర్శకనిర్మాతల నుండి హీరోయిన్ గా తనకు ప్రపోజల్ రావడంతో కొంత ఆలోచన చేసిన అనుష్క, ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం, అలానే తాను మరొక రెండు ప్రాజక్ట్స్ చేయడానికి సిద్దమవడంతో తాను ఆ సినిమా చేయలేనని సున్నితంగా తిరస్కరించిందట. 

 

అంత పెద్ద హీరో సరసన హీరోయిన్ గా అవకాశం రావడమే గొప్ప అని, అటువంటి అవకాశాన్ని మీరు అనవసరంగా వదులుకుంటున్నారు అంటూ సదరు దర్శక నిర్మాతలు చెప్పినప్పటికీ అనుష్క వాటిని పెద్దగా లక్ష్యపెట్టలేదని టాక్. రీమేక్ గా తెరకెక్కనున్న ఆ సినిమా ఒరిజినల్ వర్షన్ లో పెద్ద హిట్ కొట్టిందని, అదేవిధంగా తప్పకుండా తెలుగులో కూడా మంచి హిట్ కొట్టడం ఖాయం అని ఆ దర్శక, నిర్మాతలు ధీమాగా ఉన్నారట. మరి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్తలో వాస్తవం ఎంతవరకు ఉందొ తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: