సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ‘స్టార్ మా’ లో టెలివిజన్ ప్రీమియర్ క్రింద రిలీజ్ అయి అత్యధిక టీవీఆర్ రేటింగ్స్ సాధించడం జరిగింది. ఏకంగా ‘సరిలేరు నీకెవ్వరూ’ 23.04 టీవీఆర్ రేటింగ్‌ సాధించడం జరిగింది. ఇటువంటి తరుణంలో కన్నడ సినిమా రంగంలో రిలీజయిన 'కేజిఎఫ్' సినిమా విడుదలయి ఒకటిన్నర సంవత్సరం గడిచిన గాని ఫుల్ క్రేజ్ ఇంకా ప్రేక్షకులలో నెలకొని ఉంది. ఈ సినిమాతో హీరో యష్ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయాడు దేశవ్యాప్తంగా. అటువంటిది యష్ నటించిన ఈ సినిమా ఈ ఆదివారం సాయంత్రం స్టార్ మా లో టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమవుతుంది. స్టార్ మాసినిమా కోసం విస్తృతంగా ప్రమోషన్లు చేయడం జరిగింది.

IHG

దీంతో ఇప్పుడు టీవీఆర్ రేటింగ్స్ లో మహేష్ బాబుకి మరియు కన్నడ హీరో యష్ కి మంచి పోటీ నెలకొంది. కే జి ఎఫ్ … 'సరిలేరు నీకు ఎవరు' సృష్టించిన 23.04 టీవీఆర్ రేటింగ్‌ దాటగలదా అన్న చర్చ సోషల్ మీడియా లో గట్టిగా జరుగుతుంది. ప్రజెంట్ వైరస్ భయంతో చాలామంది ప్రజలు ఇంటిలోనే ఉంటున్న తరుణంలో ఆడియన్స్ ఎక్కువగా చూసే అవకాశం ఉందని అంటున్నారు.

IHG

ముఖ్యంగా యూత్ ఇంటిలోనే ఉంటున్న తరుణంలో ‘కెజిఎఫ్’ మ్యాగ్జిమం మహేష్ బాబు సినిమా రేటింగ్‌ను దాటే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు. మరోపక్క కెజిఎఫ్ 2 ప్రజెంట్ నిర్మాణదశలో ఉంది. వచ్చే దసరాకి ఈ సినిమా రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావించిన తరుణంలో మహమ్మారి కరోనా రావటంతో రిలీజ్ వాయిదా పడింది. పరిస్థితులు కంట్రోల్ లోకి వచ్చాక వచ్చే ఏడాది 'కెజిఎఫ్ 2' సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: