టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సినిమా నిర్మాణ రంగంలో కూడా రాణిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థ పేరిట సినిమాలు చేస్తూ మరో పక్క తను హీరోగా బిజీ అవుతున్నారు. అదేవిధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా కొణిదెల ప్రొడక్షన్ అనే సంస్థ పెట్టి తన తండ్రి చిరంజీవి నటించిన సినిమాలను ఎక్కువగా నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

IHG

ఇదిలా ఉండగా ఇదే జాబితాలో కి హీరో దగ్గుబాటి రానా రానున్నట్లు త్వరలో ప్రొడ్యూసర్ గా కూడా సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో ద్విపాత్రాభినయంగా రానా సినిమా రంగంలో రాణించడానికి రెడీ అవుతున్నారట. మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఇప్పుడప్పుడే థియేటర్లో ఓపెన్ అయ్యే పరిస్థితి దేశంలో ఎక్కడా కనబడటం లేదు. ఇలాంటి తరుణంలో రానా పిల్లలకోసం సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు... చైల్డ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని యానిమేషన్ తరహా సినిమాలను రానా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

IHG

అయితే ఈ సినిమాలు థియేటర్లో కాకుండా ఓటిటిలో విడుదల చేయాలని... ఆ దృష్టిలో ఆలోచిస్తూ రానా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రానా గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశిప' సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదే తరుణంలో ఈ ఏడాది చివరిలో రానా నటించిన ‘విరాటపర్వం’ ఈ సినిమా విడుదల కానుంది. రెండు సినిమాల పై మంచి నమ్మకం మీద ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: