టాలీవుడ్ అందాల భామ సమంత అక్కినేని ముందుగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి నటిగా పరిచయమైన విషయం తెలిసిందే. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఆ సినిమాను ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకున్న ఈ సినిమా, హీరోయిన్ గా సమంతకు ఎంతో గొప్ప క్రేజ్, పేరు ని తెచ్చిపెట్టింది. కేవలం హీరోయిన్ సమంత కోసమే అప్పటి యువత ఎందరో ఈ సినిమా చూడడానికి ఎగబడడం విశేషంగా చెప్పుకోవాలి. 

ఇక ఆ తరువాత నుండి వరుసగా టాలీవుడ్ సహా పలు ఇతర భాషల్లో కూడా సమంతకు హీరోయిన్ గా అవకాశాలు వెల్లువెత్తాయి. అక్కడి నుండి వరుసగా టాలీవుడ్ లో ఛాన్స్ లతో దూసుకెళ్లిన సమంత ఎన్నో పెద్ద హిట్స్ అందుకున్నారు. అంతేకాక తన కెరీర్ లో చేసిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు విజయాలు గా మలుచుకున్న సమంతని టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ భామ అని కూడా అంటుంటారు. ఇటీవల తన తొలి సినిమా హీరో నాగచైతన్యతో వివాహం అనంతరం కొంత సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ పోతున్న సమంత, గత ఏడాది ఓ బేబీ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసారు. 

 

 

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో డిఫరెంట్ స్టోరీ తో ఒక కొరియన్ మూవీ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయి మంచి హిట్ కొట్టింది. ఇకపోతే నేటితో ఈ సినిమా రిలీజ్ అయి సక్సెస్ఫుల్ గా ఏడాది పూర్తి అవడంతో పలువురు సమంత ఫ్యాన్స్ దీనిని ఒక ట్రెండ్ గా సెట్ చేసి సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో పరిగెత్తిస్తున్నారు. కాగా ఈ విషయమై అభిమానులకు ట్విట్టర్ ద్వారా కాసేపటి క్రితం ప్రత్యేకంగా ప్రేమతో కృతజ్ఞతలు తెలిపారు సమంత. ఇప్పటికే ఈ సినిమా ట్రెండ్ లక్షన్నరకు వరకు ట్వీట్స్ తో మంచి జోష్ తో ముందుకు సాగుతోంది....!!   
 

మరింత సమాచారం తెలుసుకోండి: