ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 80 శాతం షూటింగ్ కంప్లీటవగా మిగతా షూటింగ్ ని ఈ నెలలో మొదలు పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తుంది. మజిలీ వంటి సూపర్ హిట్ తర్వాత మళ్ళీ చైతూ నటిస్తున్న సినిమా ఇదే కావడం అలాగే ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్, టీజర్ కి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ రావడంతో పక్కా సూపర్ హిట్ అని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా కొసం  కొన్ని కథలు విన్నప్పటికి అవి చైతూ కి నచ్చలేదు. ఫైనల్ గా మనం దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

 

అక్కినేని ఫ్యామిలీకి మనం వంటి మరపురాని చిత్రాన్ని ఇచ్చాడు దర్శకుడు విక్రం కుమార్. అప్పటి నుంచి అక్కినేని ఫ్యామిలీతో విక్రం కుమార్ కి అన్నపూర్ణ సంస్థలో అక్కినేని ఫ్యామిలీలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నేపథ్యంలోనే చైతూ ఈ దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే చైతూకి విక్రం కుమార్ కథ  బాగా నచ్చడంతో నెక్స్ట్ సినిమా ఇదే అని ఫిక్స్ అయ్యాడట. ఇక ఈ సినిమాకి "థాంక్యూ" అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.

 

అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో మాత్రం రోజుకో కొత్త పేరు వినిపిస్తుంది. టాలీవుడ్ లో ఇప్పుడు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయని కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. కాని ఇప్పటికే వరసగా సినిమాలు కమిటయి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో కీర్తికి బదులు  కన్నడ బ్యూటి రష్మిక మందన్నని చిత్ర బృందం హీరోయిన్ గా అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది కూడా ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. 

 

అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం విక్రం కుమార్ కి ఈ సినిమాలో చైతూ సరసన సమంతని నటింపజేయలని తను రాసుకున్న హీరోయిన్ పాత్రకు సమంత కరెక్ట్ గా సూటవుతుందని భావిస్తున్నాడట. మజిలీ తర్వాత అలాంటి కథలు ఉంటే ఇద్దరం కలిసి నటిస్తామని చైతు సమంత చెప్పిన మాట వాస్తవమే. దాంతో విక్రం కుమార్ సినిమాలో మరోసారి ఈ ఇద్దరు కలిసి నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి ప్రాజెక్ట్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించక ముందే హీరోయిన్స్ లిస్ట్ మాత్రం బాగా పెరిగిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: