టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో తన కెరీర్ 27వ సినిమాగా తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ కు జోడిగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుండగా, యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించనున్నాడు. 

IHG

ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకులు, ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా తరువాత మహేష్ బాబు, దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తారనే వార్తలు ఓవైపు వెలువడుతున్నప్పటికీ, అదేమి కాదు ఈ సినిమా అనంతరం వంశీ పైడిపల్లితో సినిమా చేస్తారని, దాని తరువాతనే రాజమౌళితో ఆయన చేయబోయే సినిమా ఉంటుందని మరికొందరు అంటున్నారు. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రస్తుత పరిస్థితుల్లో అనుకున్న విధంగా రాబోయే సంక్రాంతి సమయానికి వచ్చే ఛాన్స్ కొంత తక్కువగానే ఉందని, దానిని బట్టి ఆ సినిమా కనుక సమ్మర్ కు వాయిదా పడితే, ఈలోపు సర్కారు వారి పాట చాలావరకు పూర్తి అవుతుందని, అలానే దాని షూటింగ్ మధ్యలో వంశీ సినిమా కూడా మొదలెట్టేలా ప్లాన్ చేస్తున్నారట మహేష్. 

 

ఇకపోతే ఇప్పటికే లాక్ డౌన్ సమాయంలో సూపర్ స్టార్ తో చేయబోయే సినిమా పూర్తి స్క్రిప్ట్ ని ఎంతో పక్కాగా సిద్ధం చేసిన వంశీ, దానిని ఆయనకు వినిపించడం, అలానే అది మహేష్ కు కూడా ఎంతో నచ్చడం జరిగిందని, ఒక స్టార్ హీరోయిన్ మహేష్ తో జోడికట్టనున్న ఈ సినిమాకు కూడా యువ తరంగం థమన్ సంగీతాన్ని అందించనున్నాడని టాక్. గతంలో మహేష్ తో వంశీ తీసిన మహర్షి సినిమాకు దేవిశ్రీ కంపోజ్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నప్పటికీ ఈసారి మాత్రం వంశీ, తన ఓటుని థమన్ కే వేశారని అంటున్నారు. మరి మహేష్, వంశీ పైడిపల్లి సినిమా విషయమై ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో పూర్తి నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే వారి నుండి అధికారిక ప్రకటన రావలసిందే అని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: