పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా వచ్చి సరిగ్గా ఎనిమిదేళ్లు పూర్తి అవుతోంది. అయినప్పటికీ కూడా ప్రేక్షకులు, ముఖ్యంగా పవన్ కళ్యణ్ అభిమానులు మాత్రం ఆ సినిమా సృష్టించిన ప్రభంజనాన్ని ఇంకా మరిచిపోలేకపోతున్నారు. అప్పట్లో ఎన్నో ఏళ్ల తరువాత పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ రూపంలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ లభించింది. పవన్ ని ఎలాగైతే అభిమానులు చూడాలని అనుకుంటున్నారో, అచ్చంగా వాళ్ళ ఆలోచనలకు రూపాన్నిస్తూ దర్శకుడు హరీష్, గబ్బర్ సింగ్ సినిమాని తెరకెక్కించి సూపర్ హిట్ చేయడంతో పాటు అందరితో కూడా శభాష్ అనిపించుకున్నారు. ఇకపోతే మళ్ళి ఎనిమిదేళ్ల గ్యాప్ తరువాత పవన్, హరీష్ ల కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. 

IHG

ఇటీవల ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమా పవన్ కెరీర్ 28వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్న పవన్, ఆ రెండు ప్రాజక్ట్స్ పూర్తి అయిన వెంటనే హరీష్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. కాగా ఈ సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ని ఇటీవల ఎంపిక చేసినట్లు చెప్పారు హరీష్. అయితే ఓవైపు హరీష్, పవన్ కాంబో కు తోడు గబ్బర్ సింగ్ కు అద్భుతమైన మ్యూజిక్ ని ఇచ్చిన దేవి కూడా రాబోయే సినిమాకు తోడవడంతో పవన్ ఫ్యాన్స్ అంచనాలు ఆకాశమే హద్దుగా మారిపోయాయి. 

 

ముఖ్యంగా సినిమా తీసే బాధ్యత దర్శకుడి హరీష్ పై, అలానే సంగీతాన్ని అదరగొట్టే బాధ్యత దేవిశ్రీప్రసాద్ పై బాగా పడనుంది. గబ్బర్ సింగ్ ని మించేలా సినిమాతో పాటు సాంగ్స్ ని ఫ్యాన్స్ ఆశిస్తారని, తప్పకుండా దానిని మించేలా ఆ సినిమా సాంగ్స్ ఉండనున్నట్లు ఆ సినిమా వర్గాల నుండి తాజా సమాచారం. మరి అన్ని కలిసి వచ్చి ఆ సినిమా కనుక మంచి సక్సెస్ అయితే మరొక్కసారి పవన్, హరీష్, దేవి కాంబోలో మరొక సూపర్ హిట్ పడినట్లే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: